Begin typing your search above and press return to search.

ప్రకాష్ రాజ్ మరో ట్వీట్.. పవన్ కోసమేనా?

తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం ఓ వైపు హాట్ టాపిక్ గా మారితే.. మరోవైపు నటుడు ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   25 Sep 2024 12:09 PM GMT
ప్రకాష్ రాజ్ మరో ట్వీట్.. పవన్ కోసమేనా?
X

తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం ఓ వైపు హాట్ టాపిక్ గా మారితే.. మరోవైపు నటుడు ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి. లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేసి తొలుత ఒక పోస్ట్ పెట్టిన ఆయన.. ఆ తర్వాత వరుసగా ట్వీట్స్ చేస్తూ వైరల్ అవుతున్నారు. తాజాగా మరోసారి ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. దీంతో అది పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించే పెట్టారని కొందరు నెటిజన్లు అంటున్నారు. అసలేం జరిగిందంటే?

తిరుమల లడ్డూ ప్రసాద తయారీలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై అంతా మండిపడుతున్న వేళ ప్రకాష్ రాజ్.. కొన్ని రోజుల క్రితం ఓ పోస్ట్ పెట్టారు. "మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగిన ఘటన. విచారణ జరిపి చర్యలు తీసుకోండి. మీరు ఎందుకు అనవసర భయాలు కల్పిస్తున్నారు? దీన్ని జాతీయస్థాయిలో ఎందుకు చర్చించుకునేలా చేస్తున్నారు? ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు" అంటూ రాసుకొచ్చి.. పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేశారు.

ప్రస్తుతం ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్న పవన్.. ప్రకాష్ రాజ్ పోస్ట్ పై రీసెంట్ గా స్పందించారు. ఇలాంటి అంశాలపై తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది చిన్నగా వార్నింగ్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ పై రెస్పెక్ట్ ఉందని చెబుతూనే కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత తాను ప్రస్తుతం విదేశాల్లో ఉన్నానని, ఇండియా వచ్చాక పవన్ ప్రశ్నలకు ఆన్సర్స్ ఇస్తానని ప్రకాష్ రాజ్ వీడియో రిలీజ్ చేశారు. వీలుంటే మళ్లీ తన ట్వీట్ చదవాలని కోరారు.

తన ట్వీట్ ను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు ప్రకాష్ రాజ్. ఈ నెల 30 తర్వాత ఇండియా వస్తానని చెప్పారు. అంతవరకు తెలిసిన విషయమే.. కానీ ఇప్పుడు ఆయన తెలుగులో ఓ పోస్ట్ పెట్టారు. చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్‌ ఆస్కింగ్‌ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ.. సారీ చెప్పిన విషయాన్నే ఇప్పుడు ప్రకాష్ రాజ్ లేవనెత్తారని నెటిజన్లు చెబుతున్నారు.

రీసెంట్ గా కార్తీ సత్యం సుందరం మూవీ ఈవెంట్ లో లడ్డూ కావాలా నాయనా మీమ్ ను చూపించారు నిర్వాహకులు. దీంతో కార్తీ.. ఇప్పుడు లడ్డూ చాలా సెన్సిటివ్ టాపిక్ అని నవ్వుతూ అన్నారు. వేడుకకు వచ్చిన వారు కూడా నవ్వారు. ఆ తర్వాత పవన్ దీనిపై స్పందించగా.. కార్తీ క్షమాపణలు చెప్పారు. దానిని ఏపీ డిప్యూటీ కూడా స్వాగతించారు. ఇప్పుడు ఆ విషయాన్నే ప్రకాష్ రాజ్ పాయింట్ అవుట్ చేసినట్లు తెలుస్తోంది. మరి పవన్ మళ్లీ రెస్పాండ్ అవుతారో లేదో చూడాలి.