Begin typing your search above and press return to search.

రణవీర్- ప్రశాంత్ వర్మ.. అసలు మ్యాటరెంటీ..?

మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే రణవీర్ సింగ్ కి భారీగా అడ్వాన్స్ ఇచ్చారు. అలాగే ప్రశాంత్ వర్మకి కూడా అడ్వాన్స్ చెల్లించారు. ఉన్నపళంగా రణవీర్ సింగ్ మూవీ నుంచి తప్పుకుంటే మరో హీరోని తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది.

By:  Tupaki Desk   |   26 May 2024 10:24 AM GMT
రణవీర్- ప్రశాంత్ వర్మ.. అసలు మ్యాటరెంటీ..?
X

హనుమాన్ మూవీతో పాన్ ఇండియా దర్శకుడిగా మారిన ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ సినిమాని భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసుకున్నారు. హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొని వెళ్తానని చెప్పారు. అయితే సడెన్ గా ఏమైందో జై హనుమాన్ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి రణవీర్ సింగ్ హీరోగా కొత్త సినిమాని స్టార్ట్ చేశారు. రాక్షస వర్కింగ్ టైటిల్ తో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఈ చిత్రాన్ని మొదలు పెట్టారు.

మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించడానికి ముందుకొచ్చింది. దీంతో మూవీ షూటింగ్ కూడా మొదలయ్యింది. అయితే ఇటీవల ఈ చిత్రం నుంచి రణవీర్ సింగ్ తప్పుకున్నాడంటూ మరికొన్ని రూమర్స్ వచ్చాయి. ప్రశాంత్ వర్మతో క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి రణవీర్ సింగ్ తప్పుకొని ముంబై తిరిగి వెళ్లిపోయినట్లు టాక్ బయటకొచ్చింది.

బాలీవుడ్ లో కూడా ఇదే ప్రచారం ప్రస్తుతం నడుస్తోంది. నిప్పులేనిదే పొగరాదనే నానుడి ప్రాచూర్యంలో ఉంది. అలాగే ఇది వాస్తవం అయ్యుండొచ్చు అనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని తాజాగా ప్రశాంత్ వర్మ టీమ్ క్లారిటీ ఇచ్చింది. త్వరలో దీనికి సంబందించిన పూర్తి వివరాలు తెలియజేస్తామని పేర్కొన్నట్లు టాక్.

మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే రణవీర్ సింగ్ కి భారీగా అడ్వాన్స్ ఇచ్చారు. అలాగే ప్రశాంత్ వర్మకి కూడా అడ్వాన్స్ చెల్లించారు. ఉన్నపళంగా రణవీర్ సింగ్ మూవీ నుంచి తప్పుకుంటే మరో హీరోని తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అందరూ వారివారి కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్నారు. అందుబాటులో ఎవరూ లేరు.

అందుకే నిర్మాతలు కలుగజేసుకొని ప్రశాంత్ వర్మ, రణవీర్ సింగ్ మధ్య ఇష్యూని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారంట. ప్రశాంత్ వర్మ కూడా కొద్దిగా వెనక్కి తగ్గి మళ్ళీ రణవీర్ తో టై అప్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడంటూ టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నుంచి త్వరలో ఈ సినిమా గురించి అఫీషియల్ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందంటూ ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తోంది.