Begin typing your search above and press return to search.

ప్రశాంత్ నీల్ లైనప్.. ఇది నిజం కాదు!

అయితే ఆ సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది ప్రశాంత్ నీల్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు.

By:  Tupaki Desk   |   25 July 2024 4:43 AM GMT
ప్రశాంత్ నీల్ లైనప్.. ఇది నిజం కాదు!
X

రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ మూవీ సిరీస్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. కేజీఎఫ్ పార్ట్ 2 అయితే ఏకంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ అందుకొని రికార్డు క్రియేట్ చేసింది. సౌత్ ఇండియాలో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ తర్వాత హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా కేజీఎఫ్ 2 ఉంది. ఈ సిరీస్ కొనసాగింపుగా పార్ట్ 3 కూడా ఉంటుందని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు.

అయితే ఆ సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది ప్రశాంత్ నీల్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కంప్లీట్ చేయాల్సినవి రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. డార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ మూవీ సూపర్ హిట్ అయ్యింది. దీనికి సీక్వెల్ గా శౌర్యంగ పర్వం చిత్రాన్ని ప్రశాంత్ నీల్ రెడీ చేయాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా డ్రాగన్ మూవీని కూడా ప్రశాంత్ నీల్ తెరకెక్కించాలి..

ఈ మూవీ షూటింగ్ మరో రెండు నెలల్లో ప్రారంభం అవుతుందనే ప్రచారం టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. సలార్ పార్ట్ 2 షూటింగ్ కూడా ఈ సంవత్సరంలోనే ప్రారంభిస్తారని టాక్ నడుస్తోంది. అయితే ఈ రెండింటిని సమాంతరంగా చేసే అవకాశం ఉందా లేదంటే ఒకదాని తర్వాత ఒకటి చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. ఈ రెండింటిలో ఏ సినిమా ముందొచ్చిన బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించడం ఖాయం అనే మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా కేజీఎఫ్ పార్ట్ 3 సినిమాని ప్రశాంత్ నీల్ అజిత్ హీరోగా చేయబోతున్నట్లు ఓ ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది. కేజీఎఫ్ పార్ట్ 2 ఎక్కడ ఎండ్ అయిందో పార్ట్ 3 అక్కడ నుంచి ప్రారంభం అవుతుందని టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదంట. ప్రశాంత్ నీల్, అజిత్ కాంబినేషన్ కి సంబంధించిన ఎలాంటి చర్చ కూడా జరగలేదని సమాచారం. అలాగే కేజీఎఫ్ పార్ట్ 3 కేవలం యష్ హీరోగానే చేయనున్నారంట.

ఇది మల్టీస్టారర్ కాదని తెలుస్తోంది. ఇప్పటికే పార్ట్ 3 కి సంబంధించిన స్టోరీ రెడీ అయిపోయిందని నిర్మాత విజయ్ కిరంగదూర్ గతంలో ప్రకటించారు. సలార్ పార్ట్ 2, డ్రాగన్ మూవీ సిరీస్ రెండు భాగాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ పార్ట్ 3 మూవీని చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే దిల్ రాజు బ్యానర్ లో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యారు. దాని తర్వాత కేజీఎఫ్ పార్ట్ 3 చేస్తాడా అంతకంటే ముందే చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.