Begin typing your search above and press return to search.

ఆ క్యారెక్టర్ ప్రభాస్ ను డామినేట్ చేయదుకదా?

2010లో పోలీస్​ పోలీస్​ అనే తెలుగు సినిమాలో నటించిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌.. ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత మళ్లీ టాలీవుడ్​లో సందడి చేయనున్నారు

By:  Tupaki Desk   |   17 Dec 2023 4:30 PM GMT
ఆ క్యారెక్టర్ ప్రభాస్ ను డామినేట్ చేయదుకదా?
X

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌.. మాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈ విలక్షణ నటుడు హీరోగా, గాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సినీరంగంలో తనదైన ముద్రవేసుకున్నారు. కొవిడ్​ టైమ్​లో ఓటీటీల ద్వారా తెలుగు ఆడియెన్స్​ను సొంతం చేసుకున్నారు. ముంబయి పోలీస్, మెమోరీస్, లూసిఫర్, జనగణమన, అయ్యపనుం కోషియుంతో తెలుగు ప్రేక్షకులకు దగరయ్యారు.

2010లో పోలీస్​ పోలీస్​ అనే తెలుగు సినిమాలో నటించిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌.. ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత మళ్లీ టాలీవుడ్​లో సందడి చేయనున్నారు. పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్- కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్​ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్​ పార్ట్-1 సీజ్​ ఫైర్​లో పృథ్వీరాజ్‌ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే మరో ఐదు రోజుల్లో ఈ సినిమా రిలీజ్​ అవ్వనుండగా.. పృథ్వీరాజ్‌ పాత్ర గురించి పలు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

పృథ్వీరాజ్​ మంచి టాలెంటెడ్​ యాక్టర్ కావడం వల్ల సలార్​ మూవీ చిత్రీకరణ సమయంలో డైరెక్టర్ ప్రశాంత్​ నీల్​ అనేక జాగ్రత్తలు తీసుకున్నారట. కీలక సన్నివేశాల్లో ప్రభాస్​ను పృథ్వీరాజ్​ డామినేట్​ చేసే అవకాశముందని నీల్​కు అనిపించిందట. ప్రభాస్​ హీరో కనుక పృథ్వీరాజ్​ కన్నా డార్లింగ్​కే ఎక్కువ ఎలివేషన్​ సీన్లు ఇచ్చారట. థియేటర్లలో ఫ్యాన్స్​ ఈలలు వేసేలా ప్రభాస్​ సీన్లను రూపొందించారట.

పృథ్వీరాజ్​ స్క్రీన్​ ప్రెజెన్స్​కు సంబంధించి మరో వార్త కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఫస్టాప్​లో పృథ్వీరాజే ఎక్కువ సేపు ఉండనున్నారట. ఇంటర్వెల్​ దగ్గర్లో ప్రభాస్​ ఎంట్రీ ఇవ్వనున్నారట. ఏదేమైనా సినిమా రిలీజ్​ అయిన వరకు పృథ్వీరాజ్ క్యారెక్టర్​ ఎలా ఉంటుందో చెప్పలేం. అయితే పృథ్వీరాజ్​.. కేజీఎఫ్​ రికార్డులను సలార్​ బ్రేక్​ చేస్తుందని ఇటీవలే ఆశాభావం వ్యక్తం చేశారు. డ్రామా, యాక్షన్​తో సలార్.. గేమ్ ఆఫ్ థ్రోన్స్​లా ఉంటుందని తెలిపారు. తన పాత్రకు సంబంధించి తానే ఐదు భాషల్లో డబ్బింగ్ చెప్పినట్లు వెల్లడించారు.

ఇక సలార్ సినిమా విషయానికొస్తే.. కేజీఎఫ్, కాంతార వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్స్మ్ ఈ మూవీని నిర్మించింది. సినిమాలో ప్రభాస్‌తో పాటు శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనాక్షి చౌదరి, ఈశ్వరి రావు, శరణ్ శక్తి తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ కానున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.