Begin typing your search above and press return to search.

SSMB29: ప్రతినాయకుడిగా ఆ స్టార్ ఫిక్స్ అయ్యారా?

ఈ మధ్యకాలంలో మలయాళీ స్టార్స్ తెలుగు పాన్ ఇండియా సినిమాలలో ఎక్కువగా భాగం అవుతున్నారు

By:  Tupaki Desk   |   3 July 2024 4:00 AM GMT
SSMB29: ప్రతినాయకుడిగా ఆ స్టార్ ఫిక్స్ అయ్యారా?
X

ఈ మధ్యకాలంలో మలయాళీ స్టార్స్ తెలుగు పాన్ ఇండియా సినిమాలలో ఎక్కువగా భాగం అవుతున్నారు. ఫాహద్ ఫాజిల్ పుష్ప 2లో ప్రతినాయకుడిగా బలమైన క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. సలార్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ వరదరాజ్ మన్నార్ పాత్రలో నటించాడు. ఈ పాత్ర మూవీలో చాలా కీలకంగా ఉంటుంది. సెకండ్ పార్ట్ లో వరద క్యారెక్టర్ కి మరింత ఎలివేషన్ ఉండబోతోందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే మరో మలయాళం స్టార్ తెలుగులో మరో పాన్ ఇండియా మూవీలో భాగం కాబోతున్నాడని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుంది. లుక్ టెస్ట్ జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. దీని తర్వాత రాజమౌళి మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టనున్నారంట. అలాగే క్యాస్టింగ్ ని కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నారంట.

ఈ చిత్రంలో మహేష్ బాబుకి ప్రతినాయకుడి పాత్ర కోసం పృథ్వీ రాజ్ సుకుమారన్ ని రంగంలోకి దించుతున్నారనే టాక్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. నిజానికి గతంలో కూడా ఈ ప్రచారం నడిచింది. అయితే దానిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ ఈ సారి మాత్రం నిజంగానే పృథ్వీరాజ్ తో మూవీ కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది. మేగ్జిమమ్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.

పృథ్వీరాజ్ కంటే ముందు ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్ ని ప్రతినాయకుడిగా తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం నడిచింది. ఈ సినిమా కథ అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందంట. వరల్డ్ అడ్వాంచర్ ట్రావెలర్ గా మహేష్ బాబు ఈ చిత్రంలో కనిపిస్తాడంట. ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని జక్కన్న ఈ మూవీ కథని రెడీ చేయించారు. అందుకే హాలీవుడ్ నుంచి విలన్ ని తీసుకుంటారనే టాక్ తెరపైకి వచ్చింది.

ఇక ఇండియన్ భాషలతో పాటు హాలీవుడ్ లో కూడా ఒకేసారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ప్లానింగ్ లో రాజమౌళి ఉన్నారంట. ఈ నేపథ్యంలో క్యాస్టింగ్ పైన గట్టిగానే వర్క్ చేస్తున్నారు. హాలీవుడ్ యాక్టర్స్ ఈ చిత్రంలో ఉంటారనేది కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఎలాంటి పాత్రలలో కనిపిస్తారు అనేది సస్పెన్స్. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కన్ఫర్మ్ అయితే మాత్రం అఫీషియల్ చిత్ర యూనిట్ ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇకపోతే ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో అత్యధిక బడ్జెట్ మూవీగా ఈ చిత్రం సిద్ధం కానుందంట. కె.ఎల్.నారాయణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.