Begin typing your search above and press return to search.

ఖుషి 2 చేయండి సార్..!

చిత్ర యూనిట్ తో పాటుగా నానితో కలిసి పనిచేసిన డైరెక్టర్స్ తో పాటుగా ప్రముఖ దర్శకులు ప్రశాంత్ వర్మ, దేవా కట్ట లాంటి దర్శకులు ఈవెంట్ కు అటెండ్ అయ్యారు.

By:  Tupaki Desk   |   25 Aug 2024 3:43 AM GMT
ఖుషి 2 చేయండి సార్..!
X

న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో వస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా వచ్చే గురువారం రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. చిత్ర యూనిట్ తో పాటుగా నానితో కలిసి పనిచేసిన డైరెక్టర్స్ తో పాటుగా ప్రముఖ దర్శకులు ప్రశాంత్ వర్మ, దేవా కట్ట లాంటి దర్శకులు ఈవెంట్ కు అటెండ్ అయ్యారు.

సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ ప్రియాంక క్యూట్ స్పీచ్ ఫ్యాన్స్ ని అలరించింది. మైక్ తీసుకున్న ఆమె అన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ సాటర్ డేనే జరుగుతున్నాయి.. ఈ సినిమా తనకు వెరీ వెరీ స్పెషల్ అన్నారు ప్రియాంక. నిర్మాత దానయ్య గారికి థాంక్స్. రెండు ఇంపార్టెంట్ మూవీస్ ఇచ్చారు. అందులో ఒకటి సరిపోదా శనివారం, రెండోది ఓజీ. ఈ రెండు నా కెరీర్ లో చాలా ఇంపార్టెంట్ అని అన్నారు.

డైరెక్టర్ వివేక్ గురించి చెబుతూ.. చారు లాంటి పాత్ర తనకు ఇచ్చినందుకు థాంక్స్. ఇంతకన్నా బెటర్ రోల్ నేను ఊహించలేనని అన్నారు. అందరు ఇది వివేక్ 2.O అంటున్నారు అది కాదు ఇక నుంచి వివేక్ ఇలాంటి సినిమాలే చేయాలని చేస్తారని అనుకుంటున్నానని అన్నారు ప్రియాంక అరుల్ మోహన్. ఎస్ జే సూర్య సార్ తో ఇది సెకండ్ సినిమా.. అంతకుముందు తమిళ్ లో డాన్ చేశా.. ఆ సినిమాలో కన్నా ఈ సినిమాలో సూర్య సర్ నుంచి ఎక్కువ నేర్చుకున్నా. ఐతే సూర్య సర్ కి నా తరపున ఒక రిక్వెస్ట్ సార్ ఖుషి 2 చేస్తే పవన్ కళ్యాణ్ సార్ తోనే చేయండి. ఇట్స్ ఏ క్లాసిక్ అని అన్నారు ప్రియాంక.

ఇక సినిమాకు పనిచేసిన అసిస్టెండ్ డైరెక్టర్స్ అందరికీ థాంక్స్. అందరు డే అండ్ నైట్ కష్టపడి పనిచేశారని అన్నారు. ఇక ఈవెంట్ కి వచ్చిన అతిథులకు థాంక్స్ చెప్పారు. నాని గురించి మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్స్. ప్రియగా అంతకుముందు ఇష్టపడ్డారు. ఇప్పటి నుంచి చారుగా ఇష్టపడతారని అన్నారు. ఇందాకా ఎవరో చెప్పినట్టుగా నాని గారు ఒక ట్రెజర్ హంటర్.. మంచి సినిమా కోసం ఎప్పుడు వెతుకుంటారు. ఆయనతో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉందని అన్నారు ప్రియాంక అరుల్ మోహన్.