Begin typing your search above and press return to search.

ఇలా అయితే నిర్మాతలకు నష్టమే.. బన్నీవాసు

దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అద్దెలు చెల్లించడం కూడా డిస్టిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కి కష్టం అయిపోతుంది.

By:  Tupaki Desk   |   24 May 2024 12:06 PM GMT
ఇలా అయితే నిర్మాతలకు నష్టమే.. బన్నీవాసు
X

గత ఐదు నెలల కాలంలో టాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో సక్సెస్ లు లేవు. మినిమమ్ ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చిన మూవీస్ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంటున్నాయి. చిన్న సినిమాలకి బాగుందనే టాక్ వస్తోన్న ప్రేక్షకాదరణ లభించడం లేదు. దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అద్దెలు చెల్లించడం కూడా డిస్టిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కి కష్టం అయిపోతుంది. భారీగా నష్టాలు చవిచూస్తున్నారు. ఈ పరిస్థితిలో నైజాంలో డిస్టిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కొత్తగా షేరింగ్ విధానం తీసుకొచ్చారు.

రెండో వారం నుంచి మూవీకి వచ్చే షేర్ లో 70 శాతం డిస్టిబ్యూటర్స్ కి 30 శాతం నిర్మాతలకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై టాలీవుడ్ నిర్మాత బన్నీ వాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గీతా ఆర్ట్స్ 2 నుంచి బన్నీ వాస్ ఎక్కువ లోబడ్జెట్ మూవీస్ చేస్తూ ఉంటారు. చిన్న సినిమాలు ఈ కొత్త షేరింగ్ విధానం వలన తీవ్రంగా నష్టపోతారని బన్నీ వాస్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

చిన్న సినిమాలకి మొదటివారంలో వచ్చే మౌత్ టాక్ ద్వారా రెండో వారం నుంచి కలెక్షన్స్ పెరుగుతాయి. సూపర్ హిట్ అయిన చిన్న సినిమాలకి చాలా వరకు రెండో వారం నుంచి మంచి మంచి కలెక్షన్స్ వచ్చి లాభాల బాట పట్టాయి. అయితే కొత్త షేరింగ్ విధానం ద్వారా 70 శాతం కలెక్షన్స్ వాటా డిస్టిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తీసుకుంటే నిర్మాతలకి ఇక మిగిలేది ఏమీ ఉండదని బన్నీ వాస్ పేర్కొన్నారు. తనకి కూడా థియేటర్స్ ఉన్నాయని ఈ ఐదు నెలల్లో నేను 2 కోట్ల వరకు నష్టపోయాను.

అయినా కూడా నిర్మాతగా ఈ కొత్త షేరింగ్ విధానాన్ని నేను సమర్ధించను. దీనిపై కౌన్సిల్ లో కచ్చితంగా చర్చిస్తాను. ఈ పద్ధతి వలన భవిష్యత్తులో చిన్న సినిమాల నిర్మాతలు డైరెక్ట్ ఓటీటీలో తమ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్స్ ఫైట్ చేయాల్సింది ఓటీటీ సంస్థలతో, అని బన్నీ వాస్ అన్నారు. ఎనిమిది వారాల నిబంధన కచ్చితంగా అమలు జరిగితే థియేటర్స్ లో సినిమాలకి ఆదరణ పెరుగుతుంది.

అయితే కొన్ని సినిమాలని రెండు, మూడు వారాలకే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీలో సినిమాల రిలీజ్ టైం పైన కచ్చితంగా పోరాటం చేయాల్సిందే. నైజాంలో ఈ కొత్త షేరింగ్ విధానం అమలైతే థియేటర్స్ మరింతగా ఖాళీ అయిపోతాయని బన్నీ వాస్ అన్నారు. థియేటర్స్ లో కలెక్షన్స్ రావని నిర్మాత డిసైడ్ అయితే ఓటీటీకే మొగ్గు చూపిస్తాడు. అప్పుడు మొత్తం ఇంపాక్ట్ అవుతుంది. అందుకే మరో సారి డిస్టిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఈ కొత్త షేరింగ్ విధానంపై పునరాలోచించాలి అని బన్నీ వాస్ అన్నారు.