Begin typing your search above and press return to search.

20 వ‌య‌సుకే క్యాన్స‌ర్‌తో నిర్మాత కుమార్తె మృతి

తిషా 21వ పుట్టినరోజుకు రెండు నెలల కంటే తక్కువ సమయం ఉంది.

By:  Tupaki Desk   |   19 July 2024 10:05 AM GMT
20 వ‌య‌సుకే క్యాన్స‌ర్‌తో నిర్మాత కుమార్తె మృతి
X

20 వ‌య‌సు అంటే చాలా చిన్న వ‌య‌సు. ముక్కుప‌చ్చ‌లార‌ని జీవితం.. కానీ ఆ యువ‌తి క్యాన్స‌ర్ తో అకాల‌మ‌ర‌ణం చెందింది. ప్ర‌ముఖ నిర్మాత, టి సిరీస్ అధినేత భూష‌ణ్ కుమార్ క‌జిన్ తిషాకుమార్ మృతి హృద‌యాల‌ను క‌ల‌చివేసింది. ఆమె భూషణ్ జీ సోద‌రుడు, నిర్మాత కం న‌టుడు క్రిషన్ కుమార్ కుమార్తె. 20 ఏళ్ల తీషా కుమార్ క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం తర్వాత మరణించింది. తిషా 21వ పుట్టినరోజుకు రెండు నెలల కంటే తక్కువ సమయం ఉంది. ఈలోగానే ఈ దుర్వార్త వినాల్సి వ‌చ్చింది.

ప్రస్తుతానికి ఈ షాకింగ్ విషాద పరిణామం గురించి పెద్దగా స‌మాచారం బ‌య‌ట‌కు రాలేదు. అయితే తీషా కుమార్ కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. ఆమె చికిత్స పొందుతూ జర్మనీలో ఉందని, అక్కడే ఆమె తుది శ్వాస విడిచిందని సంబంధిత‌ వర్గాలు పేర్కొన్న‌ట్టు బాలీవుడ్ హంగామా త‌న క‌థ‌నంలో పేర్కొంది.

తిషా కుమార్ 6 సెప్టెంబరు 2003న క్రిషన్ కుమార్ - తాన్యా సింగ్ దంపతులకు జ‌న్మించింది. నటి నటాషా సింగ్ కి తిషా సోదరి. తిషా కుమార్ గురించి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది. అయినప్పటికీ, టి-సిరీస్ నిర్మించిన సినిమాల‌ ప్రదర్శనలలో తిషా అప్పుడ‌ప్పుడు కనిపించేది. 30 నవంబర్ 2023న ఆమె రణబీర్ కపూర్ నటించిన యానిమల్ ప్రీమియర్‌లో కనిపించారు. ఇది తిషా చివరి బహిరంగ ప్రదర్శనలలో ఒకటి. ఈ ఈవెంట్‌లో స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ల‌కు ఫోజులిచ్చింది. సోలోగా, అలాగే తండ్రి క్రిషన్ కుమార్‌తో క‌లిసి పోజులిచ్చింది. తిషాకుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థ‌న‌లు..