Begin typing your search above and press return to search.

డబుల్ దెబ్బకు పూరి నష్ట నివారణ.. మరో సినిమా ఆఫర్?

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ గా ఒకప్పుడు టాలీవుడ్ లో చక్రం తిప్పిన పూరీ జగన్నాథ్ ప్రస్తుతం ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 Aug 2024 9:18 AM GMT
డబుల్ దెబ్బకు పూరి నష్ట నివారణ.. మరో సినిమా ఆఫర్?
X

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ గా ఒకప్పుడు టాలీవుడ్ లో చక్రం తిప్పిన పూరీ జగన్నాథ్ ప్రస్తుతం ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆయన మార్క్ కు తగ్గట్టుగా కంటెంట్ సినిమాల్లో అస్సలు కనిపించడం లేదనే కామెంట్స్ ఎక్కువయ్యాయి. విజయ్ దేవరకొండతో తీసిన లైగర్ మూవీ భారీ ఫ్లాప్ కావడంతో ఆయన.. రీసెంట్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అవ్వడం, సాంగ్స్ అదిరే రెస్పాన్స్ అందుకోవడం, రిలీజ్ కు ముందు అంచనాలు ఏర్పడడంతో సినిమా ఆడియన్స్ ను మెప్పిస్తుందని అంతా అనుకున్నారు.

కానీ ఈసారి డబుల్ ఇస్మార్ట్ అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో పూరీ జగన్నాథ్ వరుసగా మరో ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే సీక్వెల్ పై మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో.. రిలీజ్ కు ముందే అన్నీ డీల్స్ ను పూర్తి చేశారు పూరీ. థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత నిరంజన్ రెడ్డి కొనుగోలు చేశారు. హనుమాన్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఆయన.. డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ హక్కులను రూ.60 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే.

అయితే డబుల్ ఇస్మార్ట్ ఇప్పటి వరకు రూ.20 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో నిరంజన్ రెడ్డి భారీగానే నష్టపోయారన్నమాట. 2024 సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన హనుమాన్ తో భారీ లాభాలు అందుకున్న ఆయన.. ఇప్పుడు బాగా లాస్ అయ్యారు. దీంతో ఇప్పుడు పూరీ నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. నిరంజన్ రెడ్డి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేసేందుకు పూరీ జగన్నాథ్ చర్చలు జరుపుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఆ మూవీలో హీరోగా తేజ సజ్జాను సెలెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిరంజన్ రెడ్డి బ్యానర్ పై తేజ హనుమాన్ మూవీ చేయడంతో ఆయనతో మంచి రిలేషన్స్ ఉంటాయి. అందుకే తేజ హీరోగా పూరీ సినిమా తీసేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ మూవీకి గాను పూరీ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా వర్క్ చేయాలని నిర్ణయించుకున్నట్లు వినికిడి. తక్కువ బడ్జెట్ లో త్వరగా షూటింగ్ చేసి సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు టాక్. విడుదల అయ్యాక లాభాలు వచ్చాక చూసుకుందామని అనుకున్నారట.

ఇప్పటికే నిరంజన్ రెడ్డికి సినిమా చేస్తానని పూరీ మాటిచ్చినా.. ఇప్పుడు ఆ ప్రాజెక్టు రూపుదాల్చుకుంటున్నట్లు తెలుస్తోంది. అది బాగానే ఉన్నా.. తేజ సజ్జా పూరీకి అసలు ఛాన్స్ ఇస్తారా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పూరీ వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్నారు. కానీ హనుమాన్ తర్వాత తేజ.. పాన్ ఇండియా లెవెల్ లో మిరాయ్ చేస్తున్నారు. ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్నారు. మరి అసలు పూరీ - తేజ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందా? యంగ్ హీరో ఛాన్స్ ఇస్తారా? నిరంజన్ రెడ్డి మళ్లీ డేర్ చేస్తారా? అనేది చూడాలి.