Begin typing your search above and press return to search.

పుష్ప 2 డేట్‌ మార్పు ప్రకటన కోసం ప్రెస్‌ మీట్‌..!?

ఒక రోజు ముందే సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   23 Oct 2024 7:24 AM GMT
పుష్ప 2 డేట్‌ మార్పు ప్రకటన కోసం ప్రెస్‌ మీట్‌..!?
X

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాను డిసెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. శ్రద్దా కపూర్‌తో ఐటం సాంగ్‌ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్‌ అందిస్తున్న సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ అంటూ ప్రచారం జరుగుతోంది. మొత్తానికి సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకున్న సమయంలో విడుదల తేదీ విషయంలో కొత్త వార్తలు వస్తున్నాయి. ఒక రోజు ముందే సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమే అన్నట్లు యూనిట్‌ సభ్యులు లీక్ ఇస్తున్నారు. అంతే కాకుండా ఒకటి రెండు రోజుల్లో సినిమా చిత్రీకరణ పూర్తి చేసి మీడియా ముందుకు యూనిట్‌ సభ్యులు రావాలని భావిస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు సుకుమార్‌ ఇంకా నిర్మాతలు మీడియా ముందుకు వచ్చి సినిమా రిలీజ్ తో పాటు పలు విషయాలను గురించి, సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల గురించి వెళ్లడించే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్‌ 5న సినిమాను విడుదల చేయడం ద్వారా మరింత ఎక్కువగా వసూళ్లు నమోదు అవుతాయని నిర్మాతలు భావిస్తున్నారట. అందుకు అల్లు అర్జున్ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.

ఒక రోజు ముందు విడుదల చేసిన కారణంగా బయ్యర్లకు, నిర్మాతలకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. కనుక అల్లు అర్జున్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిన నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చి అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అల్లు అర్జున్‌ కు జోడీగా ఈ సినిమాలో రష్మిక మందన్న నటిస్తోంది. పుష్ప పార్ట్‌ 1 సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. హిందీ డబ్బింగ్‌ వర్షన్ వంద కోట్లకు పైగా వసూళ్లు చేసిన నేపథ్యంలో ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా బిజినెస్ చేసింది. హిందీ వర్షన్ ను ఏకంగా రూ.200 కోట్ల థియేట్రికల్‌ రైట్స్ కి అమ్మడం జరిగిందని సమాచారం అందుతోంది.

కేరళలో ఈ సినిమా రూ.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా థియేట్రికల్‌ రైట్స్ ద్వారా రూ.1000 కోట్లకు పైగా నిర్మాతలు మూట కట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక నాన్‌ థియేట్రికల్‌ రైట్స్ తో మరో మూడు నుంచి నాలుగు వందల కోట్ల వరకు మూట కట్టుకుంటారని సమాచారం అందుతోంది. మొత్తానికి పుష్ప 2 తో మైత్రి మూవీ మేకర్స్ కి లాభాల పంట ఖాయం. సినిమా సక్సెస్‌ కొడితే బయ్యర్లకు సైతం లాభాల పంట దక్కడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్‌ మీడియాలో వస్తున్న బజ్ నేపథ్యంలో రోజు రోజుకు బిజినెస్ పెరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి డిసెంబర్‌ 5న రాబోతున్న సినిమా ఏ రేంజ్‌ వసూళ్లు సాధిస్తుంది అనేది చూడాలి.