Begin typing your search above and press return to search.

విడ్డూరం... రాజా సాబ్‌ రిలీజ్ కి ముందే ...ఇంకో హీరో !

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ హీరోగా ప్రియదర్శన్‌ దర్శకత్వంలో ఒక హర్రర్‌ కామెడీ జోనర్ లో ఒక సినిమాను చేయబోతున్నాడు.

By:  Tupaki Desk   |   3 Sep 2024 8:30 AM GMT
విడ్డూరం... రాజా సాబ్‌ రిలీజ్ కి ముందే ...ఇంకో హీరో !
X

సలార్‌, కల్కి 2898 ఏడీ వంటి బిగ్గెస్ట్‌ హిట్స్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమా 'రాజా సాబ్‌'. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై మొదట్లో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి లేదు. అసలు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఏంటని అంతా ముక్కున వేలేసుకున్నారు. కానీ మెల్ల మెల్లగా మారుతి రివీల్‌ చేస్తున్న విషయాలు ఇంకా సినిమా లో ప్రభాస్ ను చూపించబోతున్న తీరుతో రాజా సాబ్‌ పై అందరికి కూడా పాజిటివ్‌ వైబ్స్ కలుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ను విభిన్న శైలి లో చూడబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రభాస్‌, మారుతి కాంబోలో రూపొందుతున్న రాజా సాబ్ సినిమా హర్రర్‌ కామెడీ జోనర్ లో ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ప్రభాస్‌ కి జోడీగా ముగ్గురు ముద్దుగుమ్మలు కనిపించబోతున్నారు, ఇక ప్రభాస్ కి తాత పాత్రలో సంజయ్ దత్‌ నటిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇంకా రాజా సాబ్ గురించిన విషయాలు అంచనాలు పెంచుతూనే ఉన్నాయి. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా ను వచ్చే ఏడాది లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్ మరో విజయాన్ని రాజా సాబ్ తో తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు.

రాజా సాబ్‌ గురించి ఒక వైపు ప్రభాస్‌ పాన్ ఇండియా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో హిందీలో అదే తరహా సినిమా రూపొందబోతుందనే వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ హీరోగా ప్రియదర్శన్‌ దర్శకత్వంలో ఒక హర్రర్‌ కామెడీ జోనర్ లో ఒక సినిమాను చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఆలియా భట్, కియారా అద్వానీ ఇంకా కీర్తి సురేష్ లు హీరోయిన్స్ గా అక్షయ్‌ కుమార్‌ కు జోడీగా నటిస్తారనే వార్తలు వస్తున్నాయి. జోనర్‌ ఇంకా హీరోయిన్స్ ముగ్గురు అవ్వడం వల్ల రాజా సాబ్‌ సినిమాకు అక్షయ్ - ప్రియదర్శన్‌ సినిమా కాపీ అయ్యి ఉంటుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు కాస్త అటు ఇటుగా అదే టైపు కథ, జోనర్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు రెండు సినిమాలు ఒకేసారి తెరకెక్కుతున్నాయి.. కనుక అందరి దృష్టి ఈ సినిమాల పై ఉంది. ముగ్గురు హీరోయిన్స్‌ అనేది చాలా రేర్‌ పాయింట్‌. రెండు సినిమాల్లో కూడా ముగ్గురు హీరోయిన్స్‌, అది కాకుండా జోనర్‌ సేమ్‌ అవ్వడం వల్ల రాజా సాబ్‌ సినిమాను విడుదలకు ముందే అక్షయ్‌ కుమార్‌ కోసం దర్శకుడు ప్రియదర్శన్‌ అదే టైపు చేస్తున్నాడా ఏంటి అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది తెలియాలంటే అక్షయ్ మూవీ పట్టాలెక్కే వరకు వెయిట్‌ చేయాల్సిందే. విభేదాలు ఏమీ రాకుండా రెండు సినిమాలు వేరు వేరు కథలు, కాన్సెప్ట్‌ లు, స్క్రీన్‌ ప్లే తో వస్తాయని ఆశిద్దాం.