Begin typing your search above and press return to search.

SSMB 29.. రాజమౌళి అక్కడ బిజీగా ఉన్నారా?

అదే సమయంలో మేకర్స్ నుంచి ఒక్క అప్డేట్ అయినా వస్తుందా అని ఫ్యాన్స్ వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 Oct 2024 10:08 AM GMT
SSMB 29.. రాజమౌళి అక్కడ బిజీగా ఉన్నారా?
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో రానున్న మూవీ కోసం సినీ ప్రియులు ఎంతగా ఎదురు చూస్తున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీంతో SSMB 29 ప్రాజెక్టుకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. అదే సమయంలో మేకర్స్ నుంచి ఒక్క అప్డేట్ అయినా వస్తుందా అని ఫ్యాన్స్ వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు.

మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9వ తేదీన అప్డేట్ వస్తుందేమో అని అంతా ఎదురుచూశారు. కానీ ఎలాంటి అప్డేట్ రాకపోయినప్పటికీ నిరాశ వ్యక్తం చేశారు. అదే సమయంలో రాజమౌళి కుమారుడు కార్తికేయ ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ ఆసక్తిని రేపుతున్నాయి. రాజమౌళితో ఫారెస్ట్ మధ్యలో జీప్ లో కూర్చుని ప్రయాణం చేస్తున్న వీడియోను రీసెంట్ గా పోస్ట్ చేశారు. మహేష్ బాబు టక్కరిదొంగ సినిమాలోని నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో సాంగ్ ను వింటూ జర్నీ చేశారు.

ఇప్పుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ పిక్స్ ను పోస్ట్ చేశారు కార్తికేయ. అందులో రాజమౌళి, కార్తికేయ జంగిల్ సఫారీ చేస్తున్నట్లు కనిపించారు. ప్రస్తుతం కార్తికేయ పోస్ట్ చేసిన పిక్స్.. తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే రాజమౌళి అండ్ కో.. ఇప్పుడు సౌతాఫ్రికా విజిట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. SSMB 29 ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అడ్వెంచర్ యాక్షన్ మూవీ కావడంతో.. షూటింగ్ లొకేషన్స్ ను సెర్చ్ చేసే పనిలో ఉన్నట్లు క్లియర్ గా అర్థమవుతుంది. రెక్కీ నిర్వహిస్తున్నట్లు సమాచారం.

మునుపెన్నడూ చూడని విధంగా అదిరిపోయే లొకేషన్స్ లో రాజమౌళి సినిమాను షూట్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే ఇప్పుడు ఆఫ్రికా వెళ్లారని సమాచారం. రియల్ లొకేషన్స్ లోనే ఎక్కువ భాగం షూట్ చేయబోతున్నట్లు టాక్. ఇక మహేష్ బాబు.. తన సినిమాలకు గాను అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో, రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు బయట సెట్స్ లో ఎప్పుడూ పాల్గొనేవారు. ఇప్పుడు SSMB 29 కోసం అడవుల్లో కూడా అడుగుపెట్టనున్నారు.

అయితే ఇప్పటికే SSMB 29 స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఇప్పటి వరకు రాజమౌళి చేసిన సినిమాలన్నింటిలో ది బిగ్గెస్ట్ మూవీ SSMB 29 అవుతుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత మూవీ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా.. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై రూ.1000 కోట్ల బడ్జెట్ తో కేఎల్ నారాయణ నిర్మిస్తున్నట్లు సమాచారం.