Begin typing your search above and press return to search.

తిరుమల లడ్డూపై రజినీకాంత్‌ సంచలన వ్యాఖ్యలు!

తిరుమల లడ్డూ.. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

By:  Tupaki Desk   |   28 Sep 2024 10:11 AM GMT
తిరుమల లడ్డూపై రజినీకాంత్‌ సంచలన వ్యాఖ్యలు!
X

తిరుమల లడ్డూ.. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో జంతువుల నూనెల, పంది కొవ్వు కలిశాయని కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను వైసీపీ అధినేత జగన్‌ తో సహా ఇతర నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

ఇప్పటికే ఈ అంశంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ విచారణకు ఆదేశించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. లడ్డూలో కల్తీ నూనెలు ఎవరు వాడారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీల నేతలు, ప్రజలు, భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన రాబోయే చిత్రం.. ‘వేట్టయాన్‌’ ప్రమోషన్‌ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ తిరుమల లడ్డూ వివాదంపై మాట్లాడారు. లడ్డూపై స్పందించాలని ఆయనను కోరగా రజినీ సున్నితంగా తప్పించుకున్నారు. ‘సారీ.. నో కామెంట్స్‌’ అని అన్నారు. తద్వారా ఈ వివాదం నుంచి తప్పించుకున్నారు.

కొద్ది రోజుల క్రితం మరో ప్రముఖ తమిళ నటుడు కార్తీ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలోనూ ఆయనకు ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. యాంకర్‌.. ‘‘లడ్డూ కావాలా నాయనా’’ అని ప్రశ్నించగా ‘‘ఇప్పుడు వద్దు.. లడ్డూ వద్దు’’ అని కార్తీ నవ్వుతూ స్పందించారు. ఇది వివాదానికి దారితీసింది.

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్‌ కళ్యాణ్‌.. కార్తీ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. లడ్డూపై జోకులు వేయొద్దని.. సనాతన ధర్మాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేయొద్దన్నారు. దీనిపై స్పందించిన కార్తీ సోషల్‌ మీడియాలో పవన్‌ కళ్యాణ్‌ ను ట్యాగ్‌ చేస్తూ క్షమాపణలు చెప్పారు. శ్రీ వేంకటేశ్వర స్వామిపై తనకు అచంచల విశ్వాసం ఉందన్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా రజినీకాంత్‌ కు కూడా వేట్టయాన్‌ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా తిరుమల లడ్డూ అంశం ప్రశ్న ఎదురవ్వగా ఆయన తెలివిగా ‘నో.. కామెంట్స్‌’’ అంటూ ఈ వివాదం నుంచి తప్పుకున్నారు. తద్వారా వివాదంలో చిక్కుకోకుండా జాగ్రత్తపడ్డారు.