Begin typing your search above and press return to search.

వైజాగ్‌లో రజనీకాంత్ 'కూలీ' ప‌ని

సూపర్ స్టార్ రజనీకాంత్ ఏజ్ లెస్ హీరోగా కొన‌సాగుతున్నారు. 73 వ‌య‌సులో ఆయ‌న బ్యాక్ టు బ్యాక్ భారీ యాక్ష‌న్ సినిమాల్లో న‌టిస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు

By:  Tupaki Desk   |   21 Aug 2024 6:06 AM GMT
వైజాగ్‌లో రజనీకాంత్ కూలీ ప‌ని
X

సూపర్ స్టార్ రజనీకాంత్ ఏజ్ లెస్ హీరోగా కొన‌సాగుతున్నారు. 73 వ‌య‌సులో ఆయ‌న బ్యాక్ టు బ్యాక్ భారీ యాక్ష‌న్ సినిమాల్లో న‌టిస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ప్ర‌స్తుతం ర‌జ‌నీ న‌టిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కూలీ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒక‌టి. ఇది వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జనవరిలో సంక్రాంతి కానుక‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు కీలక షెడ్యూల్స్‌ని పూర్తి చేసుకుంది చిత్ర బృందం.

తాజా అప్‌డేట్‌ ప్రకారం.. కూలీ మూడవ షెడ్యూల్ నిన్న ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో ప్రారంభమైంది. యూనిట్ కనీసం 40 రోజుల పాటు షూటింగ్ కోసం ఈ సుందరమైన బీచ్ సిటీలో క్యాంపెయినింగ్ లో ఉంది. రజనీ, శ్రుతిహాసన్ స‌హా ఇతర ప్రముఖ తారలతో కలిసి షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అనౌన్స్‌మెంట్ టీజర్‌లో వెల్లడించినట్లుగా బంగారం స్మగ్లింగ్ మాఫియా నేపథ్యానికి వ్యతిరేకంగా కూలీ కథాంశం ర‌క్తి క‌ట్టించ‌నుంద‌ని తెలిసింది. వైజాగ్ దాని విశాలమైన తీర ప్రాంతం.. ఫిషింగ్ హార్బర్ ప‌రిస‌రాల్లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీకరించనున్నార‌ని స‌మాచారం. ఈ సినిమా కోసం ర‌జ‌నీకాంత్ ఏకంగా 160 రోజుల పాటు కాల్షీట్లు కేటాయించారంటే ఎంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కుతుందో ఆలోచించాలి. కూలీ చిత్రాన్ని కళానిధి మారన్ తన సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో మహేంద్రన్, సత్యరాజ్, రెబా మోనికా జాన్, కిషోర్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

జైల‌ర్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత ర‌జ‌నీకాంత్ న‌టించ‌నున్న సినిమా కోసం అభిమానులు ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నారు. ఈ గ్యాప్‌లో కుమార్తె ఐశ్వ‌ర్య తెర‌కెక్కించిన సినిమా నిరాశ‌ప‌ర‌చ‌డంతో ర‌జ‌నీ కాంత్ త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ విష‌య‌మై చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ని తెలిసింది. కూలీ చిత్రాన్ని లోకేష్ క‌న‌గ‌రాజ్ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. లోకేష్ తో సినిమా చిత్రీక‌ర‌ణ‌ కంటే ముందే వేట్ట‌యాన్ చిత్రీక‌ర‌ణ‌ను ర‌జ‌నీ పూర్తి చేసారు.