Begin typing your search above and press return to search.

రాజ్ తరుణ్ కి చాలా మంది హీరోయిన్స్ తో ఎఫైర్స్ - లావణ్య

హీరో రాజ్ తరుణ్, అతని ప్రియురాలు లావణ్య ఇష్యూ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది

By:  Tupaki Desk   |   9 July 2024 4:13 AM GMT
రాజ్ తరుణ్ కి చాలా మంది హీరోయిన్స్ తో ఎఫైర్స్ - లావణ్య
X

హీరో రాజ్ తరుణ్, అతని ప్రియురాలు లావణ్య ఇష్యూ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చనీయాంశంగా అయ్యింది. లావణ్య ముందుగా వచ్చి రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా మీద ఫిర్యాదు చేసింది. అలాగే సంచలన ఆరోపణలు కూడా చేసింది. డ్రగ్స్ కేసులో రాజ్ తరుణ్ నన్ను ఇరికించాడని చెప్పింది. అలాగే మాల్వీ మల్హోత్రా తనని చంపేస్తానని బెదిరిస్తుందని, తనకి ప్రాణహాని ఉందని ఆరోపణలు చేసింది.

వీటిపై రాజ్ తరుణ్ రియాక్ట్ అయ్యారు. లావణ్య అన్ని అసత్య ఆరోపణలు చేస్తుందని, ఆమె డ్రగ్స్ కి అలవాటుపడిందని ఆరోపించారు. ఆ డ్రగ్స్ కోసమే తనని ఎప్పటికప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తుందని అన్నారు. అలాగే నా ఇల్లుని కాజేయాలని లావణ్య ప్లాన్ చేసి ఈ ఆరోపణలు చేస్తుందని విమర్శించారు. మాల్వీతో తనకి ఎలాంటి ఎఫైర్ లేదని పేర్కొన్నారు. మాల్వీ కూడా మీడియా ముందుకొచ్చింది లావణ్యపై పోలీసులకి ఫిర్యాదు చేసింది.

ఇదిలా నడుస్తూ ఉండగానే లావణ్య మరల మీడియా ముందుకొచ్చి తన దగ్గర ఉన్న ఆధారాలని బయటపెడుతోంది. ప్రెస్ మీట్ లో రాజ్ తరుణ్ పై సంచలన ఆరోపణలు చేసింది. రాజ్ తరుణ్ చాలా మంది హీరోయిన్స్ తో ఎఫైర్ పెట్టుకున్నాడని, నాకు తెలిసి 4గురు హీరోయిన్స్ తో అతనికి ఎఫైర్స్ ఉన్నాయని పేర్కొంది. ఆరేళ్ళ క్రితం రిలీజ్ అయిన ఓ మూవీ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకుంటే నేను ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ఆమె ఆగిపోయిందని లావణ్య చెప్పింది. అలాగే మరో మూవీ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడని ఆరోపించింది. మరికొంతమంది అతని లిస్ట్ లో ఉన్నారని లావణ్య తెలిపింది.

అయితే మా ఇద్దరికి పెళ్లయిందనే విషయం తెలిసాక చాలా మంది తప్పుకున్నారని, మాల్వీ మల్హోత్రా మాత్రం తిరిగి తనని బ్లాక్ మెయిల్ చేస్తుందని లావణ్య ఆరోపించింది. నా నుంచి రాజ్ తరుణ్ ని దూరం చేస్తానని చెప్పి మరీ చేసింది. అలాగే నన్ను జైల్లో పెట్టిస్తా అని చెప్పి పెట్టించింది. ఇప్పుడు చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చింది. అందుకే ప్రాణభయంతో బయటకి రావాల్సి వచ్చింది అని లావణ్య మీడియాతో తెలియజేసింది.

ఇప్పటికే ఆమె అడ్వాకేట్ సహాయంతో లీగల్ గా ఫైట్ చేయడానికి రెడీ అయ్యింది. ఇంత వరకు వచ్చాక అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెబుతున్నానని లావణ్య క్లారిటీ ఇచ్చింది. మరి ఈ వ్యవహారం ఏ స్థాయి వరకు వెళ్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.