Begin typing your search above and press return to search.

మా రిలేషన్ గురించి ఇండస్ట్రీలో అందరికి తెలుసు - లావణ్య

హీరో రాజ్ తరుణ్, అతని ప్రియురాలు లావణ్య ఇష్యూ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది

By:  Tupaki Desk   |   9 July 2024 6:47 AM GMT
మా రిలేషన్ గురించి ఇండస్ట్రీలో అందరికి తెలుసు - లావణ్య
X

హీరో రాజ్ తరుణ్, అతని ప్రియురాలు లావణ్య ఇష్యూ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంపై ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు. రాజ్ తరుణ్, లావణ్య వ్యక్తిగత విషయం కావడంతో వారితో పరిచయాలు ఉన్నవారు కూడా ఈ వ్యవహారంలో తలదూర్చే ప్రయత్నం చేయడం లేదు. రాజ్ తరుణ్ కొత్త సినిమా రిలీజ్ కి ముందు ఈ వ్యవహారం అతనికి కూడా ఇబ్బందికరంగా మారింది.

11 ఏళ్ళుగా సహజీవనంలో ఉన్న తనని వదిలించుకోవాలని రాజ్ తరుణ్ అనుకుంటున్నాడని లావణ్య ఆరోపణలు చేస్తోంది. మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ రిలేషన్ లో ఉన్నాడని చెప్పడానికి తన దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని లావణ్య చెబుతుంది. తాజాగా ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో లావణ్య చాలా విషయాలని పంచుకుంది. తనని లావణ్య బ్లాక్ మెయిల్ చేస్తుందని, 2017 నుంచి తనతో నాకు ఎలాంటి ఫిజికల్ రిలేషన్ లేదని రాజ్ తరుణ్ చేసిన ఆరోపణలకి లావణ్య క్లారిటీ ఇచ్చింది.

ఇద్దరి మధ్య గొడవలు జరిగినపుడు నేను న్యాయం కోసం ఫైట్ చేస్తా అని చెప్పిన మాటలని అతను బ్లాక్ మెయిల్ అంటే ఏమీ చేయలేనని లావణ్య చెప్పింది. మా మధ్య గొడవ గురించి మా పేరెంట్స్ కి చెప్పిన, రాజ్ తరుణ్ పేరెంట్స్ కి చెప్పిన దానిని బెదిరిస్తున్నట్లు అంటాడు. అతను వేరే అమ్మాయిలతో ఎఫైర్స్ పెట్టుకున్నప్పుడు కోపంలో అన్నమాటలుని ఇప్పుడు బయటకి తీసి రాజ్ తరుణ్ మాట్లాడుతున్నాడని లావణ్య చెప్పుకొచ్చింది.

రాజ్ తరుణ్ తో నేను రిలేషన్ లో ఉన్నాననే విషయం ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసని లావణ్య చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ మేనేజర్ గా ఉన్న అతనికి తెలుసని, అలాగే వరుణ్ సందేశ్, నిఖిల్ కి కూడా తెలుసని లావణ్య చెప్పింది. అయితే న్యాయం కోసం తాను వారెవరిని సంప్రదించే ప్రయత్నం చేయలేదని లావణ్య క్లారిటీ ఇచ్చింది. అలాగే వారు కూడా నాకు కాల్ చేయలేదని లావణ్య పేర్కొంది. నిఖిల్ నాకు చాలా ఏళ్ళ నుంచి పరిచయం ఉందని, నన్ను ఎవరికి పరిచయం చేసిన రాజ్ తరుణ్ భార్యగానే పరిచయం చేస్తాడని లావణ్య పేర్కొంది. రాజ్ తో ఉన్న గొడవల గురించి నిఖిల్ కి తెలుసని లావణ్య క్లారిటీ ఇచ్చింది.

గుడిలో పెళ్లి చేసుకున్నామని, అయితే ఆర్ధికంగా సెటిల్ అయ్యాక అఫీషియల్ గా అందరి సమక్షంలో పెళ్లి చేసుకొని రిజిస్టర్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నామని లావణ్య చెప్పింది. ఇలాంటి ఒక ఇష్యూ జరుగుతుందని తెలిస్తే అప్పుడే జాగ్రత్త పడేదానిని అని తెలిపింది. రాజ్ తరుణ్ పేరెంట్స్ ఒక నెల క్రితం వరకు తనతో బాగానే ఉండేవారని, రాజ్ తరుణ్ చెప్పిన తర్వాత వారు నన్ను బ్లాక్ చేశారని లావణ్య పేర్కొంది. మాల్వీ మల్హోత్రా కోసం రెగ్యులర్ గా ముంబై, పాండిచ్చేరి రాజ్ తరుణ్ వెళ్ళేవాడిని తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని లావణ్య చెప్పుకొచ్చింది.

మాల్వీ కూడా రాజ్ తరుణ్ ని పెళ్లి చేసుకుంటానని వాళ్ళ పేరెంట్స్ కి చెప్పిందని లావణ్య ఇంటర్వ్యూలో పేర్కొంది. లావణ్యని వదిలేస్తే అభ్యంతరం లేదని మాల్వీ పేరెంట్స్ కూడా రాజ్ తరుణ్ కి చెప్పారని, వీటికి ఆధారాలు చూపించమంటే చూపించడం కష్టం అని లావణ్య తెలిపింది. చాలాకాలం నుంచి తనని వదిలించుకోవాలని ప్లాన్ లో రాజ్ తరుణ్ ఉన్నాడని అతని మాటల బట్టి అర్థమవుతోందని, నేను మాల్వీ మీద మాత్రమే ఆరోపణలు చేస్తున్నానంటే బలమైన ఆధారాలు ఉండబట్టే కదా అని లావణ్య ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. తనకి న్యాయం చేయాలని ఇప్పుడైనా మీడియా ముందుకి రావడం జరిగిందని లావణ్య ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.