Begin typing your search above and press return to search.

అతని బెదిరింపులతోనే ఆత్మహత్యాప్రయత్నం - లావణ్య

రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి

By:  Tupaki Desk   |   13 July 2024 12:56 PM GMT
అతని బెదిరింపులతోనే ఆత్మహత్యాప్రయత్నం - లావణ్య
X

రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఈ వివాదంలో లావణ్య తరపున లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర చట్టబద్ధంగా ఫైట్ చేయడానికి రెడీ అయ్యారు. ఆమెకి న్యాయం చేయాలని భావిస్తున్నారు. లావణ్య కూడా కళ్యాణ్ దిలీప్ సుంకరతోనే మీడియా ముందుకి రావడంతో పాటు పోలీసులకి సాక్ష్యాలు సమర్పించింది. దీంతో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రాపై కేసు ఫైల్ అయ్యింది. రాజ్ తరుణ్ తో తనకి వివాహం అయ్యిందని, అలాగే రెండు సార్లు అబార్షన్ చేసాడని లావణ్య సాక్ష్యాలతో సహా ఆరోపిస్తోంది.

అలాగే ఇంకా చాలా సాక్ష్యాలు సేకరించినట్లు, రాజ్ తరుణ్ కి గతంలో ఎవరెవరితో ఎఫైర్స్ ఉన్నాయనేది కూడా రికార్డెడ్ గా ప్రూఫ్స్ ఉన్నాయని కళ్యాణ్ దిలీప్ సుంకర తెలిపారు. ఇదిలా ఉంటే శుక్రవారం రాత్రి లావణ్య పోలీసులకి, మీడియా వారికి, లాయర్ రాజేష్ అనే వ్యక్తికి సూసైడ్ లెటర్ పంపించింది. రాజ్ తరుణ్ లేని జీవితం తనకు వద్దంటూ సూసైడ్ లెటర్ లో లావణ్య పేర్కొంది. అయితే లాయర్ రాజేష్ పోలీసులని అలెర్ట్ చేయడంతో లావణ్య ఆత్మహత్యప్రయత్నం చేయకుండా ఆపగలిగారు. ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చారు.

ఇదిలా ఉంటే తాజాగా లావణ్య లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకరతో మీడియా ముందుకొచ్చింది. లాయర్ రాజేష్ బెదిరించడంతోనే తనకి న్యాయం జరగదని భావించి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు పేర్కొంది. లాయర్ రాజేష్ ని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు సంప్రదించారని, అతను నాకు మెసేజ్ లు చేసి రాజ్ తరుణ్ And సంబందించిన వారు బెదిరిస్తున్నారని లావణ్య మీడియాతో తెలిపింది. హైప్రొఫైల్ ఉన్నవారితో పెట్టుకుంటే ఏమౌతుందో చూపిస్తా అంటూ బెదిరించారని తెలిపింది. అలాగే డబ్బులు తీసుకొని కేసు వాపస్ తీసుకోవాలని సూచించారని లావణ్య తెలియజేసింది.

లాయర్ రాజేష్ రాజ్ తరుణ్ తరపున తనని బెదిరించి, భయపెడుతున్నాడని ఆరోపించింది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసిన రాజ్ తరుణ్ నీ దగ్గరకి తిరిగి రాడని భయపెట్టడంతోనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు మీడియా ముందు సంచలన విషయాలు బయటపెట్టింది. అందరికి మెసేజ్ చేసే క్రమంలోనే రాజేష్ కి నా సూసైడ్ లెటర్ వెళ్లిపోయిందని లావణ్య తెలిపింది. అయితే రాజ్ తరుణ్ తనకి సెకండ్ ఒపీనియన్ కోసం ఫోన్ చేసిందని, ఆమెకి సెక్యూరిటీ కల్పించాలని డీజీపీ కార్యాలయానికి రిక్వెస్ట్ చేసినట్లు రాజేష్ మీడియాతో తెలిపారు.

రాజ్ తరుణ్ పేరెంట్స్ తో టచ్ లో ఉన్న వ్యక్తితో నేను ఎందుకు టచ్ లోకి వెళ్తానని లావణ్య ప్రశ్నించింది. వారం రోజులుగా రాజేష్ నుంచి నాకు మెసేజ్ లు వస్తున్నాయని లావణ్య తెలిపింది. నేను ఇప్పటికి కళ్యాణ్ దిలీప్ సుంకర గారితోనే చట్టబద్ధంగా ఫైట్ చేస్తున్నానని లావణ్య మీడియాతో తెలిపింది. తప్పుడు సెక్షన్ లు రాజ్ తరుణ్ మీద పెట్టారని, అవి నిలబడని రాజేష్ తనకి ఫోన్ చేసి కన్ఫ్యూజ్ చేశారని లావణ్య ఆరోపణలు చేసింది. తాను చనిపోతే దానికి పూర్తి కారణం మాల్వీ మల్హోత్రానే అవుతుందని లావణ్య నేరుగా అర్పించింది.