Begin typing your search above and press return to search.

లావణ్య సంచలన నిర్ణయం.. రాజ్ తరుణ్ కోసం నిరాహార దీక్ష

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హీరో రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   14 July 2024 5:39 AM GMT
లావణ్య సంచలన నిర్ణయం.. రాజ్ తరుణ్ కోసం నిరాహార దీక్ష
X

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హీరో రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంలో పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. పదేళ్లపాటు రాజ్ తరుణ్ తో కలిసి ఉన్నానని ముందు చెప్పిన లావణ్య.. 2014లో పెళ్లి చేసుకున్నామని చెప్పింది. ఇండస్ట్రీలో కొందరు సెలబ్రిటీలకు తమ పెళ్లి విషయం తెలుసు అని పేర్కొంది.

తనకు రెండు సార్లు అబార్షన్ చేయించాడని చెప్పిన లావణ్య.. ఇటీవల ఆ విషయంపై మళ్లీ స్పందించేందుకు నిరాకరించింది. నటి మాల్వీ మల్హోత్రా వల్ల తనను రాజ్ తరుణ్ దూరం పెడుతున్నాడని ఆరోపించింది. రీసెంట్ గా పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. తన వద్ద ఉన్న ఆధారాలు కూడా సమర్పించానని చెప్పింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కూడా ఆశ్రయిస్తానని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే నిన్న రాత్రి ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకోవడం సంచలనంగా మారింది.

విషయం తెలుసుకున్న పోలీసులు.. సమయానికి వెళ్లి ఆమెను రక్షించారు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడింది లావణ్య. రాజ్ తరుణ్‍ తో కలిసి ఉండాలని తాను కోరుకుంటున్నానని తెలిపింది. అందుకోసమే తాను ఈ పోరాటం చేస్తున్నానని చెప్పింది. అతడి కోసం నిరాహార దీక్ష చేస్తానని పేర్కొంది. తాను డ్రగ్స్ తీసుకుంటానని సాకులు చెప్పి.. రాజ్ తరుణ్ దూరం పెట్టాడని ఆరోపించింది. ఏదేమైనా అతడు తనకు కావాలని చెప్పింది లావణ్య.

రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రాపై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పింది లావణ్య. సరైన ఆధారాలు సబ్మిట్ చేశానని తెలిపింది. కానీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. ఒక ఎఫ్ ఐఆర్ కాఫీ మాత్రం ఇచ్చారని తెలిపింది. కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులు వస్తున్నాయని ఆరోపణలు చేసింది. తనకు రక్షణ కావాలని చెప్పింది. అందుకే ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని తెలిపింది. తాను చేస్తున్న అన్ని ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని పేర్కొంది.

పెళ్లి విషయంలో రాజ్ తరుణ్ సాగదీస్తూ వచ్చాడని లావణ్య తండ్రి ఆరోపించారు. తన కూతురికి బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. మాల్వీతో పాటు అతడి సోదరుడు మయాంక్ కూడా లావణ్యను బెదిరించారని ఆమె తరఫున న్యాయవాది వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే మాల్వీ కూడా ఫిల్మ్స్ నగర్ స్టేషన్‍ లో లావణ్యపై కంప్లైట్ ఇచ్చింది. మరి చివరకు ఏం జరుగుతుందో వేచి చూడాలి.