Begin typing your search above and press return to search.

ర‌కుల్ పెళ్లి వేదిక గోవా కి షిప్ట్ అయిందా?

అయితే తాజాగా మోదీ పిలుపుతో వెడ్డింగ్ వేదిక మారిన‌ట్లు తెలుస్తోంది. వీదేశాల్లో కాకుండా స్వ‌దేశంలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటు ఓవార్త వైర‌ల్ అవుతోంది.

By:  Tupaki Desk   |   2 Feb 2024 5:30 AM GMT
ర‌కుల్ పెళ్లి వేదిక  గోవా కి షిప్ట్ అయిందా?
X

ప్ర‌ధాని మోదీ పిలుపుతో ర‌కుల్-జాకీ భ‌గ్నానీ పెళ్లి వేదిక మార్చేసారా? డెస్టినేష‌న్ వెడ్డింగ్ విదేశాల నుంచి స్వ‌దేశానికి మారిపోయిందా? అంటే అవున‌నే వినిపిస్తుంది. ర‌కుల్ ప్రీత్ సింగ్ -జాకీ భ‌గ్నానీ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఫిభ్ర‌వ‌రి చివ‌రి వారాంతంలో వీదేశాల్లో డెస్టినేష‌న్ వెడ్డింగ్ కి రెడీ అవుతున్నారు. కేవ‌లం రెండు కుటుంబాలు...స‌న్నిహితుల‌..స్నేహితుల స‌మంక్షంలోనే వేడుక ప్లాన్ చేసుకున్నారు.

అయితే తాజాగా మోదీ పిలుపుతో వెడ్డింగ్ వేదిక మారిన‌ట్లు తెలుస్తోంది. వీదేశాల్లో కాకుండా స్వ‌దేశంలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటు ఓవార్త వైర‌ల్ అవుతోంది. కొన్ని రోజుల క్రితం ప్ర‌ధాని మోదీ ల‌క్ష్య‌ద్వీప్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడు ప‌ర్యాట‌కులు.. డెస్టినేష‌న్ వెడ్డింగ్చేసుకోవాల‌నుకునే వారు వేరే దేశాల‌కు వెళ్ల‌కుండా మ‌న దేశంలోనే మంచి ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను సెల‌క్ట్ చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు.

ఆ పిలుపుకు దేశ‌వ్యాప్తంగా మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో కొంత మంది సెల‌బ్రిటీలు ఇక‌పై వెకేష‌న్ కోసం మాల్దీవుల‌కు వెళ్ల‌మ‌ని..స్వ‌దేశంలోనే అలాంటి వాటిని ప్లాన్ చేసుకుంటామ‌ని ప్రామిస్ చేసారు. ఒక‌వేళ వేరే దేశ‌మైనా వెళ్తాం కానీ మాల్దీవుల‌కు మాత్రం వెళ్ల‌మ‌ని తేల్చి చెప్పేసారు. ఈ క్ర‌మంలోనే ర‌కుల్ జంట కూడా పెళ్లి వేదిక మార్చిన‌ట్లు సమాచారం.

విదేశాల నుంచి గోవాకి వేదిక షిప్ట్ చేస్తున్న‌ట్లు వినిపిస్తుంది. కాబోయే దంత‌తులు ఇద్ద‌రు వారి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి చ‌ర్చించి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఇటీవ‌లే అయోధ్య రామ‌మందిర ప్రాణ‌ప్ర‌తిష్ట‌కు కూడా ఈ జంట హాజ‌రైంది. అక్క‌డ ప్రత్యేక పూజ‌లు కూడా చేశారు. ఈ ప‌రిణామ‌ల‌న్నీ చూస్తుంటే పెళ్లి వేదిక ఎక్క‌డ అన్న‌ది ర‌కుల్ ఏ క్ష‌ణ‌మైనా రివీల్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.