Begin typing your search above and press return to search.

చరణ్.. ఓ పెద్ద తలనొప్పి తప్పినట్లే!

కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ సీక్వెల్ కోసం చరణ్ ఆలోచించాల్సిన అవసరం లేదు. మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా.. అది సింగిల్ ఫిల్మే. కాబట్టి సీక్వెల్ తలనొప్పి చరణ్ కు తప్పినట్లే.

By:  Tupaki Desk   |   11 Oct 2024 3:30 PM GMT
చరణ్.. ఓ పెద్ద తలనొప్పి తప్పినట్లే!
X

ఆర్ఆర్ఆర్ మూవీతో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. తన పాపులారిటీని ఎంతగా పెంచుకున్నారో అందరికీ తెలిసిందే. నేషనల్ వైడ్ గా క్రేజ్ దక్కించుకున్నారు. వేరే లెవెల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. దీంతో అందరి దృష్టి ఆయన అప్ కమింగ్ చిత్రాలపై పడింది. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీలో కనిపించిన ఆయన.. ఇప్పుడు సోలోగా గేమ్ ఛేంజర్ ముూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా చిత్రీకరణ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. త్వరలో పూర్తి కానుంది. క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు ప్రకటించినా.. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ.. పొంగల్ కే గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుందని అంతా చెబుతున్నారు. ఏదేమైనా రామ్ చరణ్ ఫ్యాన్స్ నిరీక్షణ మూడేళ్లుగా కొనసాగుతోంది.

అయితే రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ తో ఎలాంటి హిట్ అందుకుంటారన్న విషయం పక్కన పెడితే.. పెద్ద తలనొప్పి వ్యవహారం నుంచి బయటపడ్డారని ఇప్పుడు నెటిజన్లు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సీక్వెల్ ట్రెండ్ నడుస్తోంది. బడా హీరోల దాదాపు అన్ని సినిమాలు.. రెండు పార్టులుగా తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ పుష్ప-2 సెట్స్ పై ఉండగా.. జూనియర్ ఎన్టీఆర్ దేవర సీక్వెల్, ప్రభాస్ సలార్ సీక్వెల్ త్వరలో స్టార్ట్ కానున్నాయి.

ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్.. దేవర పార్ట్-1తో వచ్చి మంచి హిట్ అందుకున్నారు. కానీ మూవీ సెకండాఫ్ కాస్త స్లో అయిందని వార్తలు వచ్చాయి. సీక్వెల్ లో చాలా క్వశ్చన్స్ కు మేకర్స్ ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంది. కానీ పార్ట్-2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. ఆయన చేతిలో వార్-2, NTR 31 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ రెండు పూర్తయ్యాక.. ఆయన దేవర-2 చేయనున్నారు. సెకండ్ పార్ట్ తో తారక్.. పార్ట్-1కు మించి హిట్ అందుకోవాలి. ప్రేక్షకులను ఆకట్టుకోవాలి!

కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ సీక్వెల్ కోసం చరణ్ ఆలోచించాల్సిన అవసరం లేదు. మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా.. అది సింగిల్ ఫిల్మే. కాబట్టి సీక్వెల్ తలనొప్పి చరణ్ కు తప్పినట్లే. అయితే బుచ్చిబాబుతో ఆయన నెక్స్ట్ వర్క్ చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరగ్గా.. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. మరి ఆ సినిమాను బుచ్చిబాబు.. రెండు పార్టులుగా తీస్తారో లేక ఒకే చిత్రంగా విడుదల చేస్తారో ఫ్యూచర్ లో చూడాలి.