Begin typing your search above and press return to search.

రామ్ చరణ్‌ - సమంత.. ఇది నిజమేనా?

ఇది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

By:  Tupaki Desk   |   23 Oct 2024 12:30 AM GMT
రామ్ చరణ్‌ - సమంత.. ఇది నిజమేనా?
X

తెలుగు సినిమా పరిశ్రమలో కొందరు హీరోలు యమా జోష్‌తో దూసుకుపోతోన్నారు. అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. ఈ మధ్యన వరుసగా హిట్లను అందుకుంటోన్న అతడు.. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత గ్లోబల్ స్టార్‌గా మారాడు. ఈ ఊపులోనే ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

‘గేమ్ చేంజర్’ షూటింగ్ జరుగుతుండగానే రామ్ చరణ్ తన 16వ సినిమాను కూడా ప్రారంభించాడు. ఈ చిత్రాన్ని ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కించబోతున్నాడు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు సైతం కంప్లీట్ అయ్యాయి. అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ కూడా మొదలు పెట్టేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేసుకుంటోంది.

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుందని ఇప్పటికే సమాచారం బయటకు వచ్చేసింది. అంతేకాదు, ఇందులో మెగా పవర్ స్టార్ రన్నర్‌ పాత్రను చేస్తున్నాడని టాక్ వచ్చింది. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని కూడా ప్రచారం జరుగుతోంది.

భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాలో ఎంతో మంది బడా స్టార్లు భాగం అవుతున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను తీసుకున్నారు. అలాగే, ముఖ్యమైన పాత్రల కోసం దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నటీనటులను ఎంపిక చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఈ చిత్రం కోసం సమంత రూత్ ప్రభును కూడా ఫైనల్ చేశారని తెలుస్తోంది.

ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం సమంత రూత్ ప్రభును తీసుకున్నారట. ఆమె పాత్ర ఎవరూ ఊహించని విధంగా, ఎంతో నేచురల్‌గా ఉంటుందని టాక్. అందుకే ఆమె కథ విన్న వెంటనే ఇందులో నటించేందుకు ఓకే చెప్పేసిందని సమాచారం. ఇది ఎంతవరకు నిజమో కానీ ప్రస్తుతం గట్టిగానే వైరల్ అవుతోంది ఇక, గతంలో సమంత - రామ్ చరణ్ ‘రంగస్థలం’ మూవీలో జంటగా చేసిన విషయం తెలిసిందే.

ఈ సినిమా దాదాపు రూ. 400 కోట్లు బడ్జెట్‌తో తెరకెక్కనుంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అలాగే, ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. దీనికి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.