Begin typing your search above and press return to search.

చిరంజీవి - రామ్ చరణ్.. పారిస్ పయనం.. ఎందుకంటే

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   25 July 2024 4:38 AM GMT
చిరంజీవి - రామ్ చరణ్.. పారిస్ పయనం.. ఎందుకంటే
X

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మెగాస్టార్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో చిత్రంగా తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ విశ్వంభర చిత్రాన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మిస్తోంది. ఈ మూవీ మెజారిటీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. రెండు సాంగ్స్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయంట.

మరోవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కంప్లీట్ చేసి నెక్స్ట్ సినిమా RC 16 కోసం సిద్ధం అవుతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ గెడ్డం, మీసకట్టుతో కనిపించనున్నాడంట. ఆ లుక్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మూవీకి కావాల్సిన లుక్ రాగానే షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు అలాగే రామ్ చరణ్, ఉపాసన ఫ్యామిలీతో పాటు పారిస్ వెళ్లారు.

వారితో పాటు క్లీంకారని కూడా తీసుకొని వెళ్లారు. చిరంజీవి తన ట్విట్టర్ లో ఫ్యామిలీతో కలిసి పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం వీక్షించేందుకు వెళ్తున్నట్లు ఫొటో షేర్ చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలో పారిస్ లో గ్రాండ్ గా ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ వేడుకను వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు హాజరయ్యే అవకాశం ఉంది. ఒలింపిక్స్ కి క్రీడా ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడలలో ప్రతిభ చూపించేవారు ఇందులో పాల్గొంటారు. ఈ ఏడాది భారత్ కూడా ఎక్కువ విభాగాలలో పథకాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకి అక్కడి ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో ఈ పారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు తిలకించేందుకు వెళ్తున్నారు. రామ్ చరణ్ ఉపాసన దంపతుల కుమార్తె క్లీంకారకి వేడుకుని చూపించబోతున్నారు.

పారిస్ టూర్ ముగించుకొని వచ్చిన తర్వాత చిరంజీవి మరల విశ్వంభర మూవీ షూటింగ్ జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. షూటింగ్ కూడా చివరి దశకు చేరుకోవడంతో సంక్రాంతి రిలీజ్ సాధ్యమవుతుందని భావిస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ డిసెంబర్ 25 కి క్రిస్మస్ కానుకగా రానున్నట్లు దిల్ రాజు కన్ఫర్మ్ చేశారు. స్టార్ డైరెక్టర్ శంకర్ ఫస్ట్ టైమ్ తెలుగులో చేస్తున్న సినిమా కావడంతో గేమ్ చేంజర్ పై కాస్త హైప్ నెలకొని ఉంది.