Begin typing your search above and press return to search.

లండన్ లో ఫ్యామిలీతో చరణ్‌, పనిలో పనిగా..!

ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత గ్లోబల్‌ స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్న రామ్‌ చరణ్‌ త్వరలో గేమ్‌ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు

By:  Tupaki Desk   |   16 July 2024 6:01 AM GMT
లండన్ లో ఫ్యామిలీతో చరణ్‌, పనిలో పనిగా..!
X

ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత గ్లోబల్‌ స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్న రామ్‌ చరణ్‌ త్వరలో గేమ్‌ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయినట్లు సమాచారం అందుతోంది.

ఇటీవలే రామ్ చరణ్ గేమ్‌ ఛేంజర్ షెడ్యూల్‌ ను ముగించుకుని ముంబై కి ఫ్యామిలీతో పాటు వెళ్లాడు. అక్కడ దాదాపు మూడు రోజుల పాటు ఉన్న చరణ్ దంపతులు అంబానీ ఇంట పెళ్లి వేడుక కి హాజరు అయ్యారు. అంబానీ వారి ఇంట పెళ్లి సందడి ముగిసిన తర్వాత చరణ్‌ ఫ్యామిలీతో కలిసి ప్రత్యేక విమానంలో లండన్‌ కి వెళ్లారు.

రామ్‌ చరణ్‌, ఉపాసన మరియు క్లీంకార లు లండన్ లో దాదాపుగా రెండు వారాలు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. హాలీడేస్ కోసం వెళ్లిన రామ్‌ చరణ్ పనిలో పనిగా అక్కడ తన మైనపు విగ్రహం ఏర్పాటు కోసం కొలతలు ఇవ్వబోతున్నట్లు కూడా సమాచారం అందుతోంది.

లండన్‌ లోని ప్రతిష్టాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ వాక్స్ మ్యూజియమ్‌ వారు రామ్‌ చరణ్‌ మైనపు విగ్రహం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. అందుకోసం ఇప్పటికే చరణ్ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించిందని తెలుస్తోంది. చరణ్ లండన్‌ లో ఉండే రెండు వారాల్లో ఏదో ఒక సమయంలో మైనపు విగ్రహం కు కొలతలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే లండన్‌ మేడమ్‌ టుస్సాడ్స్ మ్యూజియం లో ప్రభాస్‌, మహేష్ బాబు, అల్లు అర్జున్ ల మైనపు విగ్రహాలు ఉన్నాయి. అక్కడ చరణ్‌ విగ్రహం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అది ఇన్నాళ్లకు సాధ్యం అవ్వబోతుందనే వార్తలు జోరుగా వస్తున్నాయి.

లండన్‌ నుంచి తిరిగి వచ్చిన వెంటనే కొత్త సినిమా కోసం వర్కౌట్స్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు దర్శకత్వంలో చరణ్ తదుపరి సినిమా ఉండబోతుంది. ఆ సినిమాలో చరణ్ కొత్త మేకోవర్‌ మరియు కొత్త ఫిజిక్ తో కనిపించాలని బుచ్చి బాబు ఆశ పడుతున్నాడు.

ఆ సినిమా కోసం రెండు నుంచి మూడు నెలల పాటు ఫిజిక్‌ కోసం కఠిన సాధన చేసే విధంగా చరణ్ ప్లాన్‌ చేసుకున్నాడట. గేమ్‌ ఛేంజర్ సినిమా ఇదే ఏడాదిలో విడుదల కానుండగా, వచ్చే ఏడాది ద్వితీయార్థంలో బుచ్చిబాబు సినిమా ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.