Begin typing your search above and press return to search.

SSMB29: ఆర్జీవి స్ట్రాంగ్ ఎలివేషన్స్

ఇందులో హాలీవుడ్ రేంజ్ లో మహేష్ బాబుని రాజమౌళి ఎలివేట్ చేయబోతున్నారంట. ఇదిలా ఉంటే తాజాగా ఆర్జీవీ రాజమౌళి గురించి ఇంటరెస్టింగ్ పోస్ట్ చేశారు.

By:  Tupaki Desk   |   25 July 2024 4:56 AM GMT
SSMB29: ఆర్జీవి స్ట్రాంగ్ ఎలివేషన్స్
X

ఇండియన్ నెంబర్ వన్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నెక్స్ట్ పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా SSMB29 వర్కింగ్ టైటిల్ తో ఇప్పటికే సినిమాని అనౌన్స్ చేశారు. కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ ఈ సినిమా కోసం రాజమౌళి పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ మూవీపై ఇంటర్నేషనల్ రేంజ్ లో చర్చ నడిచే అవకాశం ఉందని చెప్పొచ్చు.

బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ లాంటి గ్రేట్ సక్సెస్ ల తర్వాత రాజమౌళి నుంచి రాబోయే సినిమా అంటే ఎక్స్ పెక్టేషన్స్ ఏ లెవెల్ లో ఉంటాయో అంచనా వేసుకోవచ్చు. వాటిని అందుకోవాలంటే జక్కన్న కూడా ఆ రెండు సినిమాలకి మించి సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ కోసం వర్క్ చేయాల్సి ఉంటుంది. డెడికేషన్, పర్ఫెక్షన్ లో రాజమౌళిని బీట్ చేసేవారు ఎవరు ఉండరని చెప్పొచ్చు. SSMB29 మూవీ వర్క్ ని ఇప్పటికే జక్కన్న స్టార్ట్ చేసేసారు.

స్క్రిప్ట్ వర్క్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం స్పెషల్ గా మేకోవర్ అయ్యారు. లాంగ్ హెయిర్, గెడ్డం, మీసకట్టుతో సూపర్ స్టార్ మహేష్ బాబు మునుపెన్నడు చూడని లుక్ లో కనిపిస్తున్నారు. అలాగే బాడీ షేప్ కూడా వర్క్ అవుట్ చేసి మార్చుకున్నారు. ఇందులో హాలీవుడ్ రేంజ్ లో మహేష్ బాబుని రాజమౌళి ఎలివేట్ చేయబోతున్నారంట. ఇదిలా ఉంటే తాజాగా ఆర్జీవీ రాజమౌళి గురించి ఇంటరెస్టింగ్ పోస్ట్ చేశారు.

ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న SSMB29 మూవీ కోసం టెక్నీషియన్స్ తో విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. కచ్చితంగా SSMB29 మూవీ మన ఇమేజినేషన్ కి అందనిస్థాయిలో ఉంటుందని భావిస్తున్నాను అంటూ పేర్కొన్నారు. అలాగే అన్ని సినిమాలకి బాప్ లా SSMB29 ఉండబోతోందని ఆర్జీవీ తెలిపారు. రామ్ గోపాల్ వర్మ లాంటి గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గురించి ఈ స్థాయిలో ఎలివేషన్ ఇచ్చారంటే కచ్చితంగా SSMB29 మూవీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందంట. ఈ ఏడాది ఆఖరిలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో జక్కన్న ఉన్నారు. హాలీవుడ్ హీరోయిన్ ని ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడిగా ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం. మలయాళీ స్టార్ పృధ్వీరాజ్ సుకుమారన్ ను ప్రతి నాయకుడిగా ఎంపిక చేసినట్లు కథనాలు ప్రసారమవుతున్నాయి. త్వరలో వీటన్నిటికి రాజమౌళి అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.