Begin typing your search above and press return to search.

ప్రశాంత్ వర్మ.. ఓ పద్దతి, ఓ ప్లాను..

ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించిన రూమర్లు కొన్ని సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

By:  Tupaki Desk   |   28 May 2024 6:38 AM GMT
ప్రశాంత్ వర్మ.. ఓ పద్దతి, ఓ ప్లాను..
X

ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించిన రూమర్లు కొన్ని సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. రణ్వీర్ సింగ్ ఒక ప్రాజెక్ట్‌కి కమిట్ అయినప్పటికీ, రిహార్సల్ షూట్ వల్ల తలెత్తిన సమస్యల కారణంగా అతను సినిమాను వదిలేశాడని వార్తలు వినిపించాయి. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆ ప్రాజెక్టు దర్శకుడు.

ఇక రిహార్సల్ షూట్ కోసం భారీ ఖర్చు చేయబడిందని, అయితే ఔట్‌పుట్‌తో పాటు దర్శకుడు ప్రశాంత్ వర్మ పనితీరు కూడా రణ్వీర్‌కి నచ్చలేదని గాసిప్స్ వచ్చాయి. అయితే ఈ విషయంలో మైత్రీ సంస్థ ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వకపోయినా, ప్రాజెక్ట్ ఉంటుందని స్పష్టం చేసింది. తాజాగా, ఈ రూమర్ల గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా స్పందించాడు.

రణ్వీర్ సింగ్‌తో తన సినిమా పక్కాగా ఉంటుందని, ఈ రూమర్లు నిజం కాదని ఆయన పేర్కొన్నారు. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, "రణ్వీర్ సింగ్‌తో జస్ట్ లుక్ టెస్ట్ మాత్రమే చేశాం. అది సంతృప్తికరంగానే వచ్చింది. నూటికి నూరు శాతం ఈ సినిమా ముందుకు సాగుతుంది" అని అన్నారు.ఇదే సమయంలో, తన తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి కూడా ప్రశాంత్ వర్మ వివరించారు.

రణ్వీర్ ప్రాజెక్టు కారణంగా జై హనుమాన్ ఇప్పట్లో ఉండకపోవచ్చు అనే టాక్ వచ్చింది. ఇక ఆ విషయంలో కూడా యువ దర్శకుడు ఒక క్లారిటీ ఇచ్చాడు. 'హనుమాన్' సీక్వెల్ 'జై హనుమాన్' వచ్చే ఏడాదే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దీనితో పాటు, 'బ్రహ్మ రాక్షస'ను కూడా సమాంతరంగా తీయబోతున్నట్లు తెలిపారు. ఈ చిత్రం 2026లో విడుదల అయ్యే అవకాశాలున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రణ్వీర్ సింగ్ నటించనున్న ఈ ప్రాజెక్ట్ పై సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన రూమర్లకు, ఫైనల్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ వివరణ ఇచ్చారు. రణ్వీర్ సింగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని వచ్చిన వార్తలు అసత్యమని తెలిపోయింది. ఇక ఈ సినిమాను మైత్రి వారు 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పక్కా ప్లాన్ తో ఒక పద్ధతి ప్రకారం ప్రశాంత్ సినిమాలను ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు. ఇక జై హనుమాన్ ను కూడా 100 కోట్లతో నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారు అనే విషయంలో ఇంకా సరైన క్లారిటీ రాలేదు. ఈ విషయంలో త్వరలోనే ఒక అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.