Begin typing your search above and press return to search.

మారుతీ నగర్ సుబ్రమణ్యం.. ఇన్ సైడ్ టాక్ ఎలా ఉందంటే?

ఆగస్టు 23న థియేటర్లలో సందడి చేయనుందీ మారుతీ నగర్ సుబ్రమణ్యం.

By:  Tupaki Desk   |   21 Aug 2024 2:57 PM GMT
మారుతీ నగర్ సుబ్రమణ్యం.. ఇన్ సైడ్ టాక్ ఎలా ఉందంటే?
X

తెలుగు సినీ ఇండస్ట్రీలో రావు రమేష్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా సిల్వర్ స్క్రీన్ పై కనిపించి తనదైన శైలిలో మెప్పించారు. ఇప్పుడు లీడ్ రోల్ లో మారుతీ నగర్ సుబ్రమణ్యం సినిమాతో మరికొద్ది గంటల్లో సందడి చేయనున్నారు. హ్యాపీ వెడ్డింగ్ ఫేమ్ లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిసున్నారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇంద్రజ ఫిమేల్ లీడ్ గా నటిస్తున్నారు. ఆగస్టు 23న థియేటర్లలో సందడి చేయనుందీ మారుతీ నగర్ సుబ్రమణ్యం.

అయితే రిలీజ్ కు ముందు మేకర్స్.. సెలబ్రిటీల కోసం 5 ప్రివ్యూ షోలను వేశారు. దీంతో ఇప్పుడు మారుతీ నగర్ సుబ్రమణ్యం టాక్ టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సినిమా ఓ హిలారియస్ రోలర్ కోస్టర్ అని మూవీ చూసిన సెలబ్రిటీలు, ఆడియన్స్ చెబుతున్నారు. రావు రమేష్ తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టారని కొనియాడుతున్నారు. మూవీ చూసిన వారు కడుపుబ్బా నవ్వుకున్నారని, మంచి కామికల్ ఎక్స్పీరియన్స్ ను సినిమా ఇచ్చిందని చెబుతున్నారు.

మిడిల్ క్లాస్ వ్యక్తిగా రావు రమేష్ సినిమాలో నటించారు. ఇంటర్వెల్ సీక్వెన్స్, క్లైమాక్స్ సీక్వెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయని చెబుతున్నారు. దీంతో సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగాయి. మూవీ కోసం వెయిటింగ్ అని సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సతీమణి తబిత సమర్పకురాలిగా వ్యవహరిస్తుడడంతో ముందు నుంచి అందరి దృష్టి మారుతీ నగర్ సుబ్రహణ్యం వైపు నెలకొంది.

సినిమా స్టోరీ నచ్చి మరీ ఆమె టీమ్‌ లో జాయిన్‌ అయ్యారట. ఇప్పుడు ఈ విషయాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. తొలిసారి తబిత సమర్పణలో వస్తున్న సినిమా సూపర్ హిట్ కానుందని చెబుతున్నారు. సుకుమార్ వాయిస్ ఓవర్ తోపాటు అల్లు అర్జున్ రిఫరెన్స్ తో అంకిత్ కొయ్య పాత్ర.. ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉందని అంటున్నారు. మరోవైపు, నేడు జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బన్నీతో పాటు సుకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దీంతో మరింత బజ్ క్రియేట్ అయింది.

పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్ బ్యానర్లపై నిర్మాతలు బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య సంయుక్తంగా నిర్మించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా కనిపించనున్నారు. హర్షవర్ధన్ కీలక పాత్రలో సందడి చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేయనుంది. మరి ఆగస్టు 23వ తేదీన రిలీజ్ కానున్న మారుతీ నగర్ సుబ్రమణ్యం మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.