Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ - నీల్ మూవీలో ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్లు?

అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్లకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

By:  Tupaki Desk   |   7 Oct 2024 1:30 PM GMT
ఎన్టీఆర్ - నీల్ మూవీలో ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్లు?
X

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, కన్నడ స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్ లో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. #NTRNeel అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం 'దేవర' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న తారక్.. త్వరలోనే సెట్స్ లో అడుగుపెట్టబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్లకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఎన్టీఆర్ తో భిన్నమైన భావోద్వేగాలతో కూడిన ఓ వైవిధ్యభరితమైన చిత్రం చేస్తున్నానని, ఇది తనకూ చాలా కొత్త కథ అని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెబుతూ వస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నను హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభును పరిశీలిస్తున్నారనే రూమర్ కూడా వినిపిస్తోంది.

'కెజియఫ్: చాప్టర్ 1' చిత్రంలో తమన్నా భాటియాతో ఐటెం సాంగ్ చేయించిన ప్రశాంత్ నీల్.. ఇప్పుడు తారక్ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో సమంతతో స్టెప్పులేయించాలని భావిస్తున్నారట. ఇందులో నిజమెంతనేది తెలియదు కానీ, ఈ న్యూస్ మాత్రం ఫ్యాన్స్ ను ఎంతో ఎగ్జైట్ చేస్తోంది. 'పుష్ప' మూవీలో ఊ అంటావా మావా అంటూ పాన్ ఇండియాని ఊపేసిన సామ్.. ఎన్టీఆర్ తో కలిసి డ్యాన్స్ చేస్తే థియేటర్లు షేక్ అవ్వడం గ్యారంటీ అని కామెంట్స్ చేస్తున్నారు.

కాకపోతే 'పుష్ప' తర్వాత సమంత మరో ఐటెం సాంగ్ చెయ్యలేదు. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు, వెబ్ సిరీసులు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అలానే సొంతంగా బ్యానర్ స్థాపించి నిర్మాతగానూ మారుతోంది. ఇలాంటి టైంలో తారక్ తో స్పెషల్ సాంగ్ చేయడానికి సామ్ ఓకే అంతుందా లేదా అనేది చూడాలి. గతంలో 'బృందావనం', 'రభస', 'జనతా గ్యారేజ్' వంటి సినిమాలలో తారక్ - సమంత కలిసి నటించిన విషయం తెలిసిందే.

తారక్ - ప్రశాంత్ నీల్ చిత్రానికి ‘డ్రాగన్‌’ అనే పేరు ప్రచారంలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఓపెనింగ్ రోజునే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ గ్యాప్ లో 'వార్ 2' మూవీతో ఆడియన్స్ ను పలకరించనున్నారు యంగ్ టైగర్. హృతిక్ రోషన్ తో కలిసి ఆయన నటిస్తున్న ఈ బాలీవుడ్ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఇదే క్రమంలో 'దేవర 2' చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.