Begin typing your search above and press return to search.

పుష్ప 2.. ఆమెకు పెద్ద తలనొప్పి!

ఎందుకంటే బాలీవుడ్ లో విక్కీ కౌశల్ తో కలిసి ఆమె చేస్తున్న చావా మూవీ అదే డేట్ న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

By:  Tupaki Desk   |   18 Jun 2024 9:54 AM GMT
పుష్ప 2.. ఆమెకు పెద్ద తలనొప్పి!
X

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న.. పుష్ప మూవీతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. శ్రీవల్లిగా అందరినీ మెప్పించి వేరే లెవెల్ లో పాపులారిటీ దక్కించుకుంది. నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుని నార్త్ టు సౌత్ అనేక సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తనదైన అందం, అభినయంతో అలరిస్తోంది. నాన్ స్టాప్ గా షూటింగ్స్ లో పాల్గొంటోంది అమ్మడు.

ఇక ప్రస్తుతం ఆమె పుష్ప-2లో శ్రీవల్లి 2.0గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఆమె ఫస్ట్ లుక్ తోపాటు సూసేకి సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇంతలో సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తూ మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇంకా షూటింగ్ పూర్తవ్వకపోవడమే పోస్ట్ పోన్ కు కారణమని మేకర్స్ తెలిపారు. మంచి క్వాలిటీతో ఔట్ పుట్ ఇవ్వడమే తమ టార్గెట్ అని చెప్పారు. బన్నీ స్పెషల్ పోస్టర్ ను షేర్ చేశారు.

డిసెంబర్ 6వ తేదీన సినిమాను రిలీజ్ చేయనున్నట్లు కూడా వెల్లడించారు. అయితే అదే ఇప్పుడు రష్మికకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే బాలీవుడ్ లో విక్కీ కౌశల్ తో కలిసి ఆమె చేస్తున్న చావా మూవీ అదే డేట్ న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. దీంతో నేషనల్ క్రష్.. పుష్ప పోస్ట్ పోన్ విషయం పట్ల డిస్సపాయింట్ అయినట్లు తెలుస్తోంది. చావా మూవీ కూడా ఇప్పుడు వాయిదా పడుతుందని అంటున్నారు.

బ్లాక్ బస్టర్ హిట్ మూవీలు తీసిన లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్న చావా మూవీ.. ఛత్రపతి శివాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. మహారాష్ట్రలో శివాజీకి స్పెషల్ అభిమానులు ఉన్నారు. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అందుకే పుష్ప, చావా ఒకేసారి విడుదలైతే.. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్ద క్లాష్ జరుగుతోంది. రెండు సినిమాల వసూళ్లపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి క్లాష్ జరగడం మంచిది కాదు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పుష్ప-2 మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల సాధించే లక్ష్యంగా రిలీజ్ అవుతుంది. కాబట్టి చావా విడుదల విషయంలో మేకర్స్ దే తుది నిర్ణయం. బాక్సాఫీస్ వద్ద పుష్ప 2తో నేరుగా పోటీ పడడం కన్నా పోస్ట్ పోన్ చేయడమే బెటర్ అని సినీ పండితులు చెబుతున్నారు. వచ్చే ఏడాది జనవరిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేస్తే అన్నీ కలిసి వస్తాయని అంటున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.