Begin typing your search above and press return to search.

మ‌ల్లూ మంద‌న్న‌ అని పిల‌వాలేమో!

ఇటీవ‌ల కేర‌ళ‌లో జ‌రిగిన ఓ ఈవెంట్లో త‌న‌ను చూసేందుకు విచ్చేసిన అభిమానుల‌ను చూసి ర‌ష్మిక ఎమోష‌న‌ల్ అయ్యారు.

By:  Tupaki Desk   |   29 July 2024 5:30 AM GMT
మ‌ల్లూ మంద‌న్న‌ అని పిల‌వాలేమో!
X

యువ‌హృద‌యాల‌ను కొల్ల‌గొట్టిన ర‌ష్మిక మంద‌న్న నేష‌న‌ల్ క్ర‌ష్ గా వెలిగిపోతోంది. పుష్ప చిత్రంతో పాన్ ఇండియ‌న్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ర‌ష్మిక ప‌బ్లిక్ అప్పియ‌రెన్స్ ల‌కు విప‌రీత‌మైన స్పంద‌న క‌నిపిస్తోంది. ఇటీవ‌ల కేర‌ళ‌లో జ‌రిగిన ఓ ఈవెంట్లో త‌న‌ను చూసేందుకు విచ్చేసిన అభిమానుల‌ను చూసి ర‌ష్మిక ఎమోష‌న‌ల్ అయ్యారు.


కేరళలో ఓ పబ్లిక్‌ ఈవెంట్ కి హాజ‌రైన‌ ర‌ష్మికను చూసేందుకు దాదాపు 2 వేలమంది అభిమానులు తరలివచ్చారు. ఈ సంద‌ర్భంగా రష్మిక త‌న‌దైన శైలిలో స్పందించారు. అభిమానుల‌నుద్దేశించి ఓ ట్వీట్‌ చేశారు. ``ఓ కార్యక్రమంలో భాగంగా జులై 25న కేరళలోని కరునాగపల్లికి వెళ్లా. ఆ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. వాళ్లు నాపై చూపించిన ప్రేమ చూసి ఆశ్చర్యపోయా. అంత ప్రేమను అస్సలు ఊహించలేదు. వారి అభిమానంతో నా హృదయం నిండిపోయింది. నన్ను ఆరాధిస్తున్నందుకు, జాగ్ర‌త్త‌లు తీసుకున్నందుకు కృతజ్ఞతలు. ఇంతమంది ప్రేమ పొందేందుకు ఏం చేశానో తెలియదు. కానీ సంతోషంగా ఉన్నా. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను`` అని అన్నారు. కేర‌ళ‌లో ర‌ష్మిక ఫాలోయింగ్ చూసాక మ‌ల్లూ ర‌ష్మిక అని పిల‌వాలేమో! అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం అరడజను చిత్రాలతో బిజీగా ఉన్న ర‌ష్మిక‌కు 2024-25 సీజ‌న్ బెస్ట్ సీజ‌న్ కాబోతోంది. పుష్ప 2-ది గర్ల్‌ఫ్రెండ్‌-సికందర్‌-కుబేర లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాల్లో ర‌ష్మిక న‌టిస్తోంది. వీటితోపాటు లక్ష్మణ్ ఉటేకర్‌ తెరకెక్కిస్తోన్న బాలీవుడ్‌ చిత్రంలోనూ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

కుబేర సహనటుడు ధనుష్‌కి విష్‌

పుట్టినరోజు శుభాకాంక్షలు ధనుష్! అంటూ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో శుభాకాంక్షలు తెలియ‌జేసిన ర‌ష్మిక కుబేర గురించి కొన్ని విష‌యాలు రివీల్ చేసింది. ధనుష్ నటించిన కుబేర నుండి కొత్త పోస్టర్‌ను షేర్ చేసిన ర‌ష్మిక ధ‌నుష్ తో క‌లిసి ఉన్న ఫోటో లేకపోవడంపై తన విచారాన్ని వ్యక్తం చేసింది. మేం కలిసి ఉన్న ఫోటో లేదు.. మా సినిమా షూటింగ్ ఎక్కువగా ఫోటోజెనిక్ గా లేని ప్రాంతాల్లో జరుగుతుంది. కానీ ఈ పోస్టర్ నాకు చాలా ఇష్టం. కాబట్టి దీనితో నేను మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. అని వెల్ల‌డించింది.

కుబేర‌ గురించి ముందుగా లీక్ అయిన కథాంశం ప్రకారం.. ధనుష్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒక ఇల్లు లేని వ్యక్తిగా కోటీశ్వ‌రుడిగాను క‌నిపిస్తాడు. మరోవైపు నాగార్జున ముంబైకి చెందిన మాఫియా డాన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. రష్మిక కూడా ఇలాంటి షాడో పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రం స్కామ్ నేప‌థ్యంలో సాగుతుంది. తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ భారీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.