Begin typing your search above and press return to search.

అంత సీక్రెట్ గా రావడమెందుకు రష్మిక..?

ఈ మూవీ ప్రీమియర్ వీక్షించడానికి రష్మిక మందనా కూడా వచ్చారు. అయితే ఆమె తన ముఖం మొత్తం మాస్క్ తో కవర్ చేశారు.

By:  Tupaki Desk   |   14 July 2023 12:50 PM GMT
అంత సీక్రెట్ గా రావడమెందుకు రష్మిక..?
X

రౌడీ హీరో విజయ్ దేవర కొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి రంగ ప్రవేశం చేశాడు ఆనంద్ దేవర కొండ. తాజాగా ఆయన బేబి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైష్ణవి చైతన్య కథనాయికగా నటించిన ఈ సినిమాలో, విరాజ్ అశ్విన్ కీలకమైన పాత్రను పోషించాడు.

కాగా, ఈ మూవీ ప్రీమియర్స్ షో వేయగా, దానిని విజయ్ దేవర కొండ వచ్చి మరీ వీక్షించారు. ఆయనతో పాటు టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా కూడా వచ్చి ఈ మూవీని వీక్షించారు. వీరిద్దరి ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. వీరిద్దరూ గతంలో వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో నటించారు. సడెన్ గా విజయ్ పక్కన రాశీని చూసి అందరూ షాకయ్యారు.

వీరి సంగతి పక్కన పెడితే, ఈ మూవీ ప్రీమియర్ వీక్షించడానికి రష్మిక మందనా కూడా వచ్చారు. అయితే, ఆమె తన ముఖం మొత్తం మాస్క్ తో కవర్ చేశారు. అంతేకాకుండా, తలకు క్యాప్ కూడా పెట్టేశారు. తన ఫేస్ అసలు కనిపించకుండా, తొందరగా ఎవరూ తనను గుర్తుపట్టకుండా ఉండేలా ఆమె జాగ్రత్త పడటం విశేషం. అయితే, అంత సీక్రెట్ గా రావడం ఎందుకు అనే అనుమానాలు చాలా మందిలో కలుగుతున్నాయి.

ఈ మూవీని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లేందుకు, ఈ మూవీ టీమ్ కి రష్మిక మొదటి నుంచి అండగా నిలిచారు. మూవీలోని పాటలను విడుదల చేయడం దగ్గర నుంచి, మూవీ ట్రైలర్ లాంఛ్ వరకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అంత సపోర్టివ్ గా ఉన్న ఆమె ప్రీమియర్స్ కి కూడా మూమీ టీమ్ తో కలిసి రావచ్చు. కానీ, అలా ఎవరికీ కనిపించకుండా, గుర్తుపట్టకుండా ఉండాలని అలా ముఖం ఎందుకు కవర్ చేసుకున్నారా అనే అనుమానం మొదలైంది. అయినా, ఆమె ఎంత జాగ్రత్తపడినా, ఆమె అక్కడికి వచ్చిన విషయం తెలిసిపోయింది. ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.

ఇక, ఈ బేబి సినిమా విషయానికి వస్తే, మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఆనంద్ దేవర కొండ, వైష్ణవి చైతన్యల పాత్రలు, వారు నటించిన తీరుకు ప్రశంసల వర్షం కురుస్తోంది. వైష్ణవి కి అయితే, ఇక టాలీవుడ్ లో అవకాశాలకు కొదవ ఉండదు అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ మూవీ కలెక్షన్లు ఎలా రాబడుతుందో చూడాలి.