Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ 'డ్రాగన్‌' రెండు కొత్త రూమర్స్‌..!

ఇక ఎన్టీఆర్‌ తదుపరి సినిమా కేజీఎఫ్‌ మేకర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో అనే విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   20 Jun 2024 10:52 AM GMT
ఎన్టీఆర్‌ డ్రాగన్‌ రెండు కొత్త రూమర్స్‌..!
X

ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. రెండు పార్ట్‌ లుగా రూపొందుతున్న దేవర సినిమా యొక్క మొదటి పార్ట్‌ ను అక్టోబర్‌ లో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

దేవర 1 షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. మరో వైపు బాలీవుడ్‌ భారీ యాక్షన్ చిత్రం వార్‌ 2 కి సంబంధించిన షూటింగ్‌ లో కూడా ఎన్టీఆర్‌ పాల్గొంటున్నాడు. ఆ మధ్య ముంబై లో జరిగిన ఒక భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ లో హృతిక్ తో కలిసి ఎన్టీఆర్‌ పాల్గొన్నాడు అంటూ బాలీవుడ్‌ మీడియా వర్గాల్లో చర్చ జరిగింది.

ఇక ఎన్టీఆర్‌ తదుపరి సినిమా కేజీఎఫ్‌ మేకర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో అనే విషయం తెల్సిందే. ఈ సినిమాకు డ్రాగన్‌ అనే టైటిల్‌ ను దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ అనుకుంటున్నాడని, అందుకు తగ్గట్లుగానే చాలా విభిన్నమైన కాన్సెప్ట్‌ మరియు బ్యాక్ డ్రాప్‌ తో సినిమాని రూపొందిస్తున్నట్లు సమాచారం అందుతోంది.

డ్రాగన్‌ సినిమాలో ఎన్టీఆర్‌ ను నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో చూపిస్తాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎన్టీఆర్‌ ను ఎలా చూసినా కూడా కచ్చితంగా ఈ సినిమాతో వారికి పూనకాలు కన్ఫర్మ్‌ అనే చర్చ జరుగుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న డ్రాగన్ గురించి మరో పుకారు షికారు చేస్తుంది.

సాధారణంగా ప్రశాంత్‌ నీల్‌ సినిమా అంటే హీరోయిన్‌ కి పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. అయినా కూడా ఆయన సినిమాలో నటించేందుకు స్టార్‌ హీరోయిన్స్‌ కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందుకే డ్రాగన్ లో రష్మిక మందన్న నటించేందుకు ఓకే చెప్పిందనే పుకార్లు వస్తున్నాయి.

డ్రాగన్‌ సినిమాలో ఎన్టీఆర్‌ నెగటివ్‌ షేడ్స్ లో కనిపించబోతున్నాడు అనే పుకార్లతో పాటు రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటించబోతుంది అనే వార్తలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే డ్రాగన్ ను సెట్స్ పైకి తీసుకు వెళ్లే విధంగా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ప్లాన్‌ చేస్తున్నారు. మరో వైపు సలార్‌ 2 ను ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్న విషయం తెల్సిందే.