Begin typing your search above and press return to search.

మాస్‌రాజా నాల్గవ సారి...!

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లో ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్నాయి. పెద్ద హీరోల సినిమాలను ఒక వైపు నిర్మిస్తూనే మరో వైపు చిన్న బడ్జెట్‌ సినిమాలను కూడా టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తూ ఉన్నాడు.

By:  Tupaki Desk   |   11 Aug 2024 7:57 AM GMT
మాస్‌రాజా నాల్గవ సారి...!
X

మాస్‌ మహారాజా రవితేజ ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈగల్ సినిమా తీవ్రంగా నిరాశ పరిచిన కూడా ఏమాత్రం తగ్గకుండా వెంటనే కొత్త సినిమా మిస్టర్ బచ్చన్ తో రాబోతున్నాడు. ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. గతంలో మాదిరిగా రవితేజ ఏడాదికి రెండు మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ తో పాటు రవితేజ ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ దశలో ఉండగానే కొత్త సినిమా ను అధికారికంగా ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు.

టాలీవుడ్‌ లో ఈ మధ్య కాలంలో అత్యధిక సినిమాలు నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. వీరు ఇప్పటికే రవితేజ తో ధమాకా సినిమాను నిర్మించి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. రవితేజ తో ఈగల్‌ ను ఆ వెంటనే మొదలు పెట్టారు. కానీ ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెల్సిందే. ఈగల్ ఫలితంతో సంబంధం లేకుండా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న మిస్టర్‌ బచ్చన్‌ ను నిర్మించారు. ఆ సినిమా ఇంకా విడుదల కాకుండానే రవితేజ తో మరో సినిమాను నిర్మించేందుకు పీపుల్స్ మీడియా నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ సిద్దం అయ్యాడు.

రవితేజ తో టిజి విశ్వ ప్రసాద్‌ నిర్మించబోతున్న కొత్త సినిమా విషయమై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు జాతిరత్నాలు ఫేం అనుదీప్ దర్శకత్వం వహించబోతున్నాడట. ఇప్పటి వరకు చర్చల దశలో ఉన్న ఈ సినిమాను అతి త్వరలోనే పట్టాలెక్కించే విధంగా పీపుల్స్ మీడియా టీం ప్లాన్‌ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ తో విభిన్నమైన కామెడీ ఎంటర్‌ టైనర్‌ ను అనుదీప్ రూపొందించే విధంగా ప్లాన్‌ చేస్తున్నాడని తెలుస్తోంది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లో ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్నాయి. పెద్ద హీరోల సినిమాలను ఒక వైపు నిర్మిస్తూనే మరో వైపు చిన్న బడ్జెట్‌ సినిమాలను కూడా టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న పలు సినిమాలకు తోడు రవితేజ తో నాల్గవ సినిమాకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ రెడీ అయ్యింది. ఈ మధ్య కాలంలో రవితేజ పారితోషికం భారీగా పెంచినా కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ వారు మాత్రం ఆయనతో సినిమాలను వరుసగా నిర్మించడం ఆశ్చర్యంగా ఉందని మీడియా వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది.