Begin typing your search above and press return to search.

మాస్ రాజాకి అక్కడ నుంచి పిలుపొచ్చిందా..?

మాస్ రాజా రవితేజ టైగర్ నాగేశ్వర రావు సినిమాతో కెరీర్ లో మొదటిసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేశాడు. స్టువర్టుపురం దొంగ నాగేశ్వర రావు జీవిత కథా స్పూర్తితో ఈ సినిమా తెరకెక్కింది

By:  Tupaki Desk   |   14 Nov 2023 5:30 PM GMT
మాస్ రాజాకి అక్కడ నుంచి పిలుపొచ్చిందా..?
X

మాస్ రాజా రవితేజ టైగర్ నాగేశ్వర రావు సినిమాతో కెరీర్ లో మొదటిసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేశాడు. స్టువర్టుపురం దొంగ నాగేశ్వర రావు జీవిత కథా స్పూర్తితో ఈ సినిమా తెరకెక్కింది. అయితే సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా రవితేజని బాలీవుడ్ కి పరిచయం చేసింది ఈ సినిమా. అంతేకాదు సినిమా ప్రమోషన్స్ లో రవితేజ గురించి ఆ సినిమాలో నటించిన అనుపం ఖేర్ కూడా గొప్పగా చెప్పాడు. ఆ టైం లో రవితేజని అక్కడ ఆడియన్స్ రిజిస్టర్ చేసుకున్నారు.

ఇదిలా ఉంటే ఈమధ్య తెలుగు స్టార్స్ కి బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. మన వాళ్లు ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు చేస్తుండగా ఇక్కడ స్టార్స్ తో కలిసి పనిచేయాలని బాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఎన్.టి.ఆ తో వార్ 2 తో హృతిక్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. మరో స్టార్ హీరో కూడా బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అన్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు రవితేజకు కూడా బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చినట్టు తెలుస్తుంది.

రవితేజ తెలుగు హీరోనే అయినా అతను అమితాబ్ బచ్చన్ కి పెద్ద ఫ్యాన్. ఇక్కడ చిరంజీవిని స్పూర్తిగా చేసుకుని సినిమాల్లోకి వచ్చినా రవితేజ అమితాబ్ కి హార్డ్ కోర్ ఫ్యాన్. ఆ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పాడు కూడా. అయితే కెరీర్ లో ఫస్ట్ టైం టైగర్ నాగేశ్వర రావుతో హిందీ ఆడియన్స్ ముందుకు వెళ్లాడు రవితేజ. ఆ సినిమా ఫలితం నిరాశ పరిచినా తన ఎఫర్ట్ నచ్చిన బాలీవుడ్ మేకర్స్ రవితేజని బాలీవుడ్ కి తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యారు.

ఇప్పటికే ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రవితేజతో కథా చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ఆ సినిమా గురించి త్వరలో డీటైల్స్ రావాల్సి ఉంది. బాలీవుడ్ లో రవితేజ చేసేది మల్టీస్టారర్ సినిమానా కాదా అన్నది కూడా త్వరలో తెలుస్తుంది. రవితేజ బాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయితే ఇక తను ఇక్కడ చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తారని చెప్పొచ్చు.

సైడ్ రోల్స్ చేస్తూ వచ్చి ఆ తర్వాత హీరో ఫ్రెండ్ గా.. విలన్ గా.. ఇలా తన కెరీర్ ని తానే డిజైన్ చేసుకుంటూ వచ్చిన రవితేజ హీరోగా వరుస సినిమాలు చేస్తూ సాధ్యమైనంత వరకు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నారు. అయితే సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా రవితేజ ప్రయత్నం మాత్రం ఆపట్లేదు. ప్రస్తుతం రవితేజ ఈగల్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని తో కూడా సినిమా లాక్ చేశాడు మాస్ రాజా.