Begin typing your search above and press return to search.

15 ఏళ్ల న‌టిని బ‌ల‌వంతంగా ముద్దాడిన పెద్ద‌ హీరో?

స‌ద‌రు నటి 15 సంవత్సరాల వయస్సులో ఒక షాకింగ్ సంఘటనను ఎదుర్కోవలసి వచ్చింది.

By:  Tupaki Desk   |   1 Oct 2024 12:30 AM GMT
15 ఏళ్ల న‌టిని బ‌ల‌వంతంగా ముద్దాడిన పెద్ద‌ హీరో?
X

ఈరోజుల్లో అంటే హేమ క‌మిటీ నివేదిక లేదా ప‌రిశ్ర‌మ‌లో వేధింపుల ప‌రిష్కార క‌మిటీలు అంటూ కొన్ని ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి కానీ, ఆ రోజుల్లో అవేవీ లేవు. అప్ప‌ట్లో స్టార్ హీరోలు ఆడిందే ఆట పాడిందే పాట‌! కొంద‌రు అగ్ర హీరోలు మోటైన స‌ర‌సం గురించి గుస‌గుస‌లాడుకున్న రోజులున్నాయి. అదంతా స‌రే కానీ.. పురుషాధిక్య ప్ర‌పంచంలోనే ధీటైన స్టార్ గా ఎదిగి కొన్నేళ్ల పాటు ఏలిన ఒక న‌టి బాల‌న‌టిగా తెరంగేట్రం చేసిన‌ప్పుడు ఒక బ‌ల‌వంత‌పు వ్య‌వ‌హారాన్ని చ‌వి చూసింది. స‌ద‌రు నటి 15 సంవత్సరాల వయస్సులో ఒక షాకింగ్ సంఘటనను ఎదుర్కోవలసి వచ్చింది.

ఒకసారి షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక నటుడు తనను బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడు. ఆమె వ‌య‌సు 15 కాగా, అత‌డి వ‌య‌సు 32. ఆ ఘ‌ట‌న‌కు 15 ఏళ్ల అమ్మాయి బిత్త‌ర‌పోయింది. షాక్ గురైంది. కానీ ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడు స‌ర్ధి చెప్పాడు. తాను చేయ‌మ‌న‌డం వ‌ల్ల‌నే ఆ హీరో అలా చేసాన‌ని అన్నాడు! అంటూ వెల్ల‌డించారు. ఈ అనుభ‌వం ఎదుర్కొన్న‌ది ఎవ‌రో కాదు మేటి అందాల తార రేఖ‌. ఆమె `రేఖ‌: ది అన్‌టోల్డ్ స్టోరీ` పేరుతో తన జీవిత చరిత్రలో ఈ విషయాన్ని వెల్లడించింది.

ఆమె నటించిన దో షికారీ (గతంలో అంజనా సఫర్ అనే టైటిల్) సినిమా సెట్స్‌లో ఈ సంఘటన జరిగింది. సూపర్‌స్టార్ బిశ్వజిత్‌తో రొమాంటిక్ సీన్ చేస్తున్నప్పుడు ఆ విషయాన్ని తనకు తెలియజేయకుండా ముద్దు పెట్టుకున్నాడని రేఖ వెల్లడించింది. ఆ సమయంలో కేవలం 15 ఏళ్ల వయస్సులో ఉన్న తాను దర్శకుడు కుల్జిత్ పాల్ కూడా దీనిని ఆపకపోవడంతో షాక్ కి గుర‌య్యాన‌ని తెలిపారు. షాట్ చిత్రీక‌రించారు. బిశ్వజిత్ తనను చాలా సేపు ముద్దుపెట్టుకున్నాడని కూడా రేఖ తెలిపింది. ఆ ఘ‌ట‌న‌తో చాలా షాక్ కి గుర‌య్యాన‌ని వెల్ల‌డించింది.

మరోవైపు బిశ్వజిత్ ఈ ఆరోపణలను తరువాత ఖండించారు. దర్శకుడి సూచన మేరకే తాను అలా చేశానని వెల్లడించాడు. ఆ సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎలా ఆదరించారో కూడా వివ‌రించాడు. ఒక క‌థ‌నం ప్ర‌కారం.. దో షికారిలో రేఖ - బిశ్వజిత్ వారి నటనకు ప్రశంసలు అందుకున్నారు. 1979లో విడుదలైన ఈ చిత్రంలో వినోద్ ఖన్నా, అమ్జద్ ఖాన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. రేఖ చివరిసారిగా యమ్లా పగ్లా దీవానా: ఫిర్ సే (2018) చిత్రంలో అతిధి పాత్రలో కనిపించింది. రేఖ‌ చివరిగా నటించిన ప్రాజెక్ట్ సూపర్ నాని 2014లో థియేటర్లలో విడుదలైంది. హృతిక్ రోషన్ న‌టిస్తున్న‌ క్రిష్ 4లో రేఖ న‌టించ‌నుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఈ ప్రాజెక్టుపై ఇటీవ‌ల క‌ద‌లిక‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మొన్న‌టికి మొన్న ఐఫా 2024 వేదిక‌పై రేఖ నృత్యాలు అహూతుల‌ను రంజింప‌జేసిన సంగతి తెలిసిందే. సీనియ‌ర్ న‌టి ఈ ఏజ్ లో ఇంత అద్భుతంగా న‌ర్తించ‌డం నిజంగా షాకింగ్ అని ప్ర‌శంసించారు.