Begin typing your search above and press return to search.

రెండో ప్రయత్నంలోనే మరీ ఇంత భారమా హీరో గారు?

దర్శకుడిగా ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న రితీష్‌ దేశ్‌ ముఖ్‌ ఇంత పెద్ద బాధ్యతను నెత్తిన వేసుకోవడం కరెక్ట్‌ కాదేమో అంటూ కొందరు హిందీ మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటూ ఉన్నారు.

By:  Tupaki Desk   |   19 Feb 2024 4:30 PM GMT
రెండో ప్రయత్నంలోనే మరీ ఇంత భారమా హీరో గారు?
X

బాలీవుడ్‌ హీరో రితీష్‌ దేశ్‌ ముఖ్‌ ఆ మధ్య వరుసగా ఫ్లాప్స్ పడటంతో కెరీర్‌ ఖతం అయినట్లే అన్నట్లుగా కొందరు విమర్శలు చేశారు. అలాంటి వారు అందరికి కూడా సమాధానం అన్నట్లుగా రితేష్ దేశ్‌ ముఖ్‌ కమ్‌ బ్యాక్ ఇచ్చాడు. మన మజిలీ సినిమా రీమేక్ 'వేద్‌' తో హిట్ కొట్టి ఫామ్‌ లోకి వచ్చాడు.

వేద్‌ కి తానే దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించాడు. దర్శకుడిగా తన మొదటి ప్రయత్నం విజయవంతం కావడంతో వరుసగా దర్శకత్వం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తన రెండో ప్రాజెక్ట్‌ గా అతి భారీ ప్రాజెక్ట్‌ ను ప్రకటించాడు.

మరాఠ ప్రజల ఆరాధ్య దైవం అయిన శివాజీ మహారాజ్ కథతో సినిమాకు రితీష్ దేశ్ ముఖ్‌ రెడీ అయ్యాడు. నటుడిగా అంటే పర్వాలేదు కానీ దర్శకుడిగా కూడా ఈ ప్రాజెక్ట్‌ ను ఆయన ఎలా డీల్‌ చేస్తాడో అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

దర్శకుడిగా ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న రితీష్‌ దేశ్‌ ముఖ్‌ ఇంత పెద్ద బాధ్యతను నెత్తిన వేసుకోవడం కరెక్ట్‌ కాదేమో అంటూ కొందరు హిందీ మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే రితీష్ మాత్రం చాలా నమ్మకంగా కనిపిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు.

చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ ను రితీష్ దేశ్‌ ముఖ్‌ ప్రకటించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హిందీ తో పాటు మరాఠీ లో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఆయన ప్రకటించాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌ తో జియో స్టూడియోస్ మరియు మైంబై ఫిల్మ్‌ కంపెనీ నిర్మించబోతుంది.

సంతోష్ శివన్‌ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించబోతున్నాడు. అజయ్ మరియు అతుల్‌ లు సంగీతాన్ని అందించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా కు సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలో వెళ్లడిస్తామని రితీష్‌ ప్రకటించాడు.