Begin typing your search above and press return to search.

వృద్దుల ముద్దు సీన్‌ తో రూ.100 కోట్లు!

రాకీ ఔర్ రాణికి ప్రేమ్‌ కహానీ సినిమా వంద కోట్ల వసూళ్లలో ధర్మేంద్ర మరియు షబానా అజ్మీ ల యొక్క ముద్దు సీన్ కీలక పాత్ర పోషించింది అంటూ సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపిస్తుంది.

By:  Tupaki Desk   |   5 Aug 2023 11:29 AM GMT
వృద్దుల ముద్దు సీన్‌ తో రూ.100 కోట్లు!
X

రణ్వీర్‌ సింగ్, ఆలియా భట్‌ హీరో హీరోయిన్‌ గా కరణ్ జోహార్‌ దర్శకత్వంలో రూపొంది ఇటీవల వచ్చిన చిత్రం 'రాకీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహానీ'. చాలా సంవత్సరాల తర్వాత కరణ్ జోహార్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా అవ్వడంతో విడుదల కు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రముఖ నటీనటులు ఈ సినిమా లో నటించడం వల్ల మంచి బజ్ క్రియేట్‌ అయ్యింది. ఓపెనింగ్‌ వసూళ్లు కూడా భారీగా నమోదు అయ్యాయి. తాజాగా ఈ సినిమా వంద కోట్ల మార్క్‌ ను కూడా క్రాస్‌ చేసింది అంటూ బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ మద్య కాలం లో హిందీ సినిమాలు వంద కోట్లు రాబట్టడం గొప్ప విషయంగా మారింది.

రాకీ ఔర్ రాణికి ప్రేమ్‌ కహానీ సినిమా వంద కోట్ల వసూళ్లలో ధర్మేంద్ర మరియు షబానా అజ్మీ ల యొక్క ముద్దు సీన్ కీలక పాత్ర పోషించింది అంటూ సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపిస్తుంది. ఈ వయసులో ఇద్దరు కూడా ముద్దు సన్నివేశం కు ఓకే చెప్పడం విడ్డూరంగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తే మరి కొందరు మాత్రం ఆ సన్నివేశం పట్ల ఆసక్తి చూపించారు.

మొత్తానికి ఈ సినిమా లోని వృద్దుల ముద్దు సన్నివేశంతో పాటు జయా బచ్చన్‌, ధర్మేంద్ర, షబానా అజ్మీ వంటి ఆ తరం స్టార్స్ ఉడటం వల్ల సినిమాకు మంచి బజ్‌ క్రియేట్ అయింది. ఆ బజ్ కి తగ్గట్లుగా వసూళ్లు నమోదు అవ్వలేదు. కానీ ఒక మోస్తరులో అయితే వసూళ్లు దక్కాయి. కరోనా కు ముందు ఇలాంటి సినిమా వచ్చి ఉంటే రూ.250 కోట్ల వసూళ్లు నమోదు అయ్యి ఉండేవి అంటూ కొందరు బాలీవుడ్‌ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక కరణ్‌ జోహార్‌ తాజా ఇంటర్వ్యూలో వృద్దుల ముద్దు సన్నివేశం గురించి మాట్లాడుతూ.. ధర్మేంద్ర, షబానా అజ్మీ ఇద్దరికి ఎలాంటి సమస్యలేనప్పుడు ముద్దు సన్నివేశం విషయం లో ఇతరులకు ఏంటి సమస్య అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.