Begin typing your search above and press return to search.

'దేవర' కి మెగా హీరో ఆల్‌ ది బెస్ట్‌

కనుక ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ప్రతి ఒక్కరు దేవర సినిమా కి ప్రత్యేకంగా విషెస్ చెబుతూ ఉన్నారు.

By:  Tupaki Desk   |   26 Sep 2024 8:05 AM GMT
దేవర కి మెగా హీరో ఆల్‌ ది బెస్ట్‌
X

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర సినిమా మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా సందడి చేసేందుకు సిద్ధం అయింది. యూఎస్ లో ప్రీమియర్ లకు అంతా సిద్ధంగా ఉంది. ఎన్టీఆర్‌ అభిమానులు మాత్రమే కాకుండా దాదాపు అందరు హీరోల అభిమానులూ సినిమా కోసం వెయిట్ చేస్తున్నామంటూ సోషల్‌ మీడియా ద్వారా కామెంట్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కనుక ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ప్రతి ఒక్కరు దేవర సినిమా కి ప్రత్యేకంగా విషెస్ చెబుతూ ఉన్నారు.

తాజాగా ఎన్టీఆర్‌ దేవర సినిమా విడుదల నేపథ్యంలో మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్ ఎక్స్ ద్వారా తన బెస్ట్‌ విషెష్‌ ను తెలియజేశారు. తారక్ అన్న, చాలా రోజుల వెయిటింగ్‌ తర్వాత నీ నుంచి అతి పెద్ద భారీ చిత్రం రేపు రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎప్పుడు చూస్తానా అంటూ చాలా ఆతృతగా ఉన్నాను. కచ్చితంగా ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ సాయి ధరమ్‌ తేజ్ ట్వీట్‌ చేశారు. చిత్ర యూనిట్ సభ్యుల అందరి పేర్లను ప్రస్థావిస్తూ సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు అందరికీ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

గతంలో సాయి ధరమ్‌ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా కి ఎన్టీఆర్‌ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెల్సిందే. అంతే కాకుండా సినిమా సాయి ధరమ్‌ తేజ్ పై క్లాప్ కొట్టి సినిమాను ఎన్టీఆర్‌ ప్రారంభించారు. ఎన్టీఆర్‌ అంటే సాయి ధరమ్‌ తేజ్ కి ప్రత్యేకమైన అభిమానం. అందుకే తన సినిమాల కోసం పలు సార్లు ఎన్టీఆర్‌ ని ముందు నిలిపిన సాయి ధరమ్‌ తేజ్ ఇప్పుడు ఎన్టీఆర్‌ సినిమా దేవర కోసం తాను ముందుకు వచ్చి మరీ బెస్ట్‌ విషెష్ చెప్పడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం అంటూ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ దేవర సినిమా ను నందమూరి కళ్యాణ్ రామ్‌, సుధాకర్‌ చెరుకూరి లు సంయుక్తంగా నిర్మించారు. దాదాపు ఈ సినిమాకు రూ.400 కోట్ల బడ్జెట్ ను వారు ఖర్చు చేశారనే వార్తలు వస్తున్నాయి. సినిమా బడ్జెట్‌ కి ఏమాత్రం తగ్గకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కేవలం థియేట్రికల్ వసూళ్ల ద్వారానే నిర్మాతలకు లాభాల పంట పండే అవకాశాలు ఉన్నాయి. ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఇతర రైట్స్ ద్వారా దేవర నిర్మాతలకు మరింత లాభాల పంట పండే అవకాశాలు ఉన్నాయి. జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో బాలీవుడ్‌ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌ కీలక పాత్రలో నటించారు. ఎన్టీఆర్‌, సైఫ్‌ అలీ ఖాన్ కాంబో సీన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయట.