Begin typing your search above and press return to search.

వాళ్ల రిక్వెస్ట్ ని పట్టించుకోని తేజ్..!

బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించినా కూడా సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు సాయి తేజ్

By:  Tupaki Desk   |   17 Jun 2024 5:30 PM GMT
వాళ్ల రిక్వెస్ట్ ని పట్టించుకోని తేజ్..!
X

మెగా మేనల్లుడు సాయి తేజ్ కెరీర్ విషయంలో ఎందుకు అంత సీరియస్ గా లేడు ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ తో పాటుగా సాయి తేజ్ ని అభిమానించే ఫ్యాన్స్ అంతా కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు. రిపబ్లిక్ సినిమా టైం లో యాక్సిడెంట్ వల్ల దాదాపు చావు అంచుల దాకా వెళ్లొచ్చిన సాయి తేజ్ మెగా అభిమానుల ప్రార్ధనల మేరకు సురక్షితంగా బయటకు వచ్చాడు. ఆఫ్టర్ యాక్సిడెంట్ తేజ్ విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా సినిమాతో హిట్ అందుకోగా ఆ తర్వాత వెంటనే బ్రో సినిమా చేశాడు.

బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించినా కూడా సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు సాయి తేజ్. బ్రో తర్వాత తేజ్ మాస్ డైరెక్టర్ సంపత్ నందితో సినిమా ప్లాన్ చేయగా ఆ సినిమా ఎందుకో సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగిపోయింది. ఇంతకీ తేజ్ నెక్స్ట్ సినిమా ఏం చేస్తున్నాడు అంటే కొత్త దర్శకుడితో సినిమా లాక్ చేశాడని తెలుస్తుంది. ఐతే ఆ సినిమా ఇంతవరకు సెట్స్ మీదకు వెళ్లలేదు.

సాయి తేజ్ ఎందుకు లేట్ చేస్తున్నాడన్నది మెగా ఫ్యాన్స్ కి అర్ధం కావట్లేదు. ఐతే ఈమధ్య సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటున్న సాయి తేజ్ ని నెక్స్ట్ సినిమా ఎప్పుడు అంటే మాత్రం సైలెంట్ గా ఉంటున్నాడు. తన సినిమా అప్డేట్ విషయంలో తనకే ఒక క్లారిటీ లేదని అర్థమవుతుంది. మెగా మేనల్లుడిగా ఫ్యాన్స్ లో మంచి క్రేజ్ అండ్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న సాయి తేజ్ ఇక మీదట కెరీర్ మీద పూర్తి ఫోకస్ చేసేలా ప్లానింగ్ ఉందట.

నెక్స్ట్ సినిమా వర్క్ ఓ పక్క జరుగుతుందని.. ఆ సినిమా షూటింగ్ మొదలు పెట్టడమే ఆలస్యం మరో సినిమా కథా చర్చలు కూడా జరపాలని చూస్తున్నాడు సాయి తేజ్. సాయి తేజ్ నెక్స్ట్ సినిమా అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఉండగా తను మాత్రం ఎలాంటి అప్డేట్స్ లేకుండా సైలెంట్ గా ఉంటున్నాడు. త్వరలోనే సాయి తేజ్ సినిమా గురించి అఫీషియల్ న్యూస్ రావాలని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు. తేజ్ మాత్రం ఇవేవి పట్టనట్టుగా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నాడు. మరి సాయి తేజ్ నెక్స్ ప్లానింగ్ ఏంటో చూడాలి.