Begin typing your search above and press return to search.

గందరగోళంకు చెక్‌ పెట్టే పనిలో మెగా తేజ్‌

బ్రేక్ టైమ్‌ లో సాయి ధరమ్‌ తేజ్ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో ఒక సినిమా గురించి ప్రధానంగా చర్చ జరిగింది

By:  Tupaki Desk   |   30 May 2024 5:30 AM GMT
గందరగోళంకు చెక్‌ పెట్టే పనిలో మెగా తేజ్‌
X

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ విరూపాక్ష సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌ జోష్ తో వరుసగా సినిమాలను చేస్తాడని అంతా భావించారు. కానీ ఆరోగ్యపరమైన కారణాలు, ఇంకా ఇతర విషయాల కారణంగా దాదాపు ఏడాది బ్రేక్ తీసుకున్నాడు.

బ్రేక్ టైమ్‌ లో సాయి ధరమ్‌ తేజ్ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో ఒక సినిమా గురించి ప్రధానంగా చర్చ జరిగింది. అదుగో, ఇదుగో అంటూ ఆ సినిమా షూటింగ్‌ గురించి, కాస్టింగ్‌ గురించి తెగ హడావుడి మీడియాలో జరిగింది. కానీ ఇప్పుడు సంపత్‌ నంది దర్శకత్వంలో సినిమా ను తేజ్ చేయడం లేదని తెలుస్తుంది.

హనుమాన్‌ సినిమాతో హిట్‌ కొట్టిన నిర్మాత నిరంజన్‌ రెడ్డి ఒక సినిమా ను సాయి ధరమ్‌ తేజ్ తో నిర్మించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కథ మరియు ఇతర విషయాల గురించి చర్చలు పూర్తి అయ్యాయి. వీరి కాంబో మూవీకి కొత్త కుర్రాడు రోహిత్‌ దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం అందుతుంది.

సంపత్‌ నంది చెప్పిన కథ మరియు ఇతర విషయాలు అన్నింటికి సాయి ధరమ్‌ తేజ్ ఓకే చెప్పాడట. కానీ ఆ సినిమా బడ్జెట్‌ విషయంలో కాస్త గందరగోళం ఉందట. నిర్మాత మొదట భారీ బడ్జెట్‌ అయినా పర్వాలేదు అన్నట్లుగా ఓకే చెప్పాడని, కానీ దర్శకుడు బడ్జెట్‌ ను మరీ ఎక్కువగా పెంచడంతో తప్పుకున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఆ విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ లోపు సాయి ధరమ్‌ తేజ్ మొత్తం గందరగోళంకు చెక్ పెట్టే విధంగా సంపత్‌ నంది దర్శకత్వంలో కాకుండా రోహిత్ దర్శకత్వంలో సినిమాకు రెడీ అవుతున్నాడు. అంటే నిజంగానే సంపత్‌ నంది తో తేజ్ చేయాల్సిన సినిమా అటకెక్కినట్లే అని, ఫ్యాన్స్ లో ఉన్న గందరగోళంకు చెక్‌ పెట్టినట్లు అయ్యిందని మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.