Begin typing your search above and press return to search.

సైంధవ్‌ ఎమోషనల్.. బుజ్జికొండవే..

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు, టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

By:  Tupaki Desk   |   29 Dec 2023 3:08 PM GMT
సైంధవ్‌ ఎమోషనల్.. బుజ్జికొండవే..
X

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్‌. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హిట్‌ ఫేమ్‌ శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేశ్ నటిస్తున్న 75వ చిత్రమిది కావడం విశేషం. ఆయన కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో భారీ యాక్షన్‌ హంగులతో రూపొందిస్తున్నారు.


ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు, టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో సైంధవ్ టీమ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలు మ్యూజిక్‌ లవర్స్‌ ను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి థ‌ర్డ్ సింగిల్ బుజ్జికొండవే లిరికల్‌ వీడియోను మేకర్స్ విడుద‌ల చేశారు. ఈ పాట‌కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఈ పాట చూస్తే.. వెంకీ, తన కూతురు మధ్య ఎమోష‌న‌ల్‌గా ఉండ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

వెంకటేశ్ కూతురికి హెల్త్ ఇష్యూ ఉంటుంది. దీంతో ప్రతి తండ్రిలాగే వెంకీ కూడా పెయిన్ ఫుల్ సిస్ట్యువేషన్స్ ఎదుర్కొంటారు. అయితే తన కూతురిని భావోద్వేగానికి గురి చేయకుండా, తన ఎమోషన్స్ ను దాచిపెడతాడు. ఈ సంఘటనకు తగినట్లు సంతోశ్ నారాయణన్‌ అద్భుతమైన ట్యూన్‌ ను అందించారు. రామజోగయ్య శాస్త్రి తన అద్భుతమైన లిరిక్స్ సన్నివేశాన్ని మనసును హత్తుకునేలా చేశాయి. ఎస్పీ చరణ్ తన మ్యాజికల్ వాయిస్ తో భావోద్వేగాలకు మరింత లోతును జోడించారు.

ఈ సాంగ్ లిరిక్స్, మ్యూజిక్, వెంకీ యాక్షన్ కంటతడి పెట్టిస్తున్నాయని నెటిజన్లు చెబుతున్నారు. నాన్నా ఒక్కసారి నవ్వూ అంటూ కూతురు బతిమాలడం తండ్రీకూతుర్ల బంధాన్ని గుర్తుచేస్తుందని చెబుతున్నారు. ఎమోషనల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ సాంగ్ ను షేర్ చేస్తున్నారు.

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ క‌థానాయిక‌గా నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు.