Begin typing your search above and press return to search.

సాయి పల్లవికి నిజంగా అన్యాయం జరిగిందా?

సౌత్ ఇండియాలో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి.

By:  Tupaki Desk   |   17 Aug 2024 9:30 AM GMT
సాయి పల్లవికి నిజంగా అన్యాయం జరిగిందా?
X

సౌత్ ఇండియాలో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి. ప్రేమమ్ సినిమాతో మలయాళంలో నటిగా కెరియర్ ప్రారంభించింది. ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో సాయి పల్లవి వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా ఆమెకి అవకాశాలు వచ్చాయి. అయితే సాయి పల్లవి సెలక్టివ్ గా మూవీస్ చేస్తూ వస్తోంది.

ఆమె డాన్స్ టాలెంట్ కి యూత్ బాగా కనెక్ట్ అయిపోయారు. సాయి పల్లవి సినిమాలో ఉందంటే కచ్చితంగా అదిరిపోయే డాన్స్ నెంబర్ ఉండాలని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆమె చేసిన సినిమాలు చూసుకుంటే అన్ని పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలే కనిపిస్తాయి. దీనిని బట్టి కథతో పాటు క్యారెక్టర్స్ కి ఆమె ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్ధం చేసుకోవచ్చు. స్టార్ హీరోలతో కేవలం సాంగ్స్ కి పరిమితం అయ్యే పాత్రల కంటే చిన్న సినిమాలలో ప్రతి ఒక్కరి మనసుకి చేరువ అయ్యే క్యారెక్టర్స్ చేయాలనేది సాయి పల్లవి కోరిక.

తాజాగా 70న నేషనల్ ఫిల్మ్ అవార్డులలో సాయి పల్లవికి అన్యాయం జరిగిందనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. ఆమె 2022లో గార్గి సినిమాలో నటించింది. ఈ మూవీని చాలా మంది సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ చూడటానికే చూశారంటే అతిశయోక్తి కాదు. ఓటీటీలో రిలీజ్ అయిన ఈ తమిళ్ మూవీకి మంచి ఆదరణ లభించింది. అత్యాచార ఆరోపణలతో అరెస్ట్ అయిన తండ్రిని విడిపించడం కోసం కూతురు చేసిన పోరాటంగా ఈ మూవీ కథ ఉంటుంది.

తండ్రి ఎలాంటి తప్పు చేయదని నమ్మిన కూతురు అతన్ని బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో తన తండ్రి నిజంగానే అత్యాచారం చేసాడని తెలిస్తే కూతురుగా ఆమె మానసిక క్షోభ ఎలా ఉంటుందనేది గార్గి సినిమాలో చాలా హృద్యంగా చూపించారు. సాయి పల్లవి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. ఈ సినిమాలో ఆమె నటనకి కచ్చితంగా నేషనల్ అవార్డు రావాలని, కానీ అన్యాయం చేశారని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

సాయి పల్లవికి నేషనల్ అవార్డుల పరంగా ప్రతిసారి అన్యాయం జరుగుతుందని ఫ్యాన్స్ ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు. 2021లో శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా సాయి పల్లవి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుందని, అప్పుడు కూడా బెస్ట్ యాక్టర్ గా పరిగణంలోకి తీసుకోలేదని అంటున్నారు. అయితే సాయి పల్లవి మాత్రం తన మనసుకి నచ్చే పాత్రలు చేసుకుంటూ వెళ్తోంది తప్ప అవార్డుల గురించి పెద్దగా ఆలోచిందనే మాట ఆమె సన్నిహితుల నుంచి వినిపిస్తోంది.

ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో తండేల్ మూవీలో నటిస్తోంది. అలాగే హిందీలో అమీర్ ఖాన్ తనయుడికి జోడీగా ఓ సినిమా చేస్తోంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. అలాగే రణబీర్ కపూర్ లీడ్ రోల్ లో రామాయణం సిరీస్ లో సీతగా సాయి పల్లవి కన్ఫర్మ్ అయ్యింది.