Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : ఇది కదా ఫ్యాన్స్ కి కావాల్సింది

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూ వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   25 Sep 2024 10:30 AM GMT
పిక్ టాక్ : ఇది కదా ఫ్యాన్స్ కి కావాల్సింది
X

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూ వస్తున్నాయి. ఆయన గతంలో కండల వీరుడు అనే ట్యాగ్‌ కలిగి ఉండేవారు. కానీ ఇప్పుడు ఆయన ఫిజికల్‌ గానూ ఫ్యాన్స్ ను అలరించలేక పోతున్నాడు. ఆయన ఇటీవల చేసిన సినిమాలు అన్నింటిలోనూ ఫిజిక్‌ పరంగా తీవ్రంగా నిరాశ పరుస్తూ వచ్చాడు. అందుకే ఈసారి ఫిజిక్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని భావించాడు. తన తాజా చిత్రం సికందర్ కోసం ఫిజికల్‌ గా కష్టపడుతున్నాడు. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సల్మాన్‌ ఖాన్‌ ప్రస్తుతం తమిళ దర్శకుడు మురుగదాస్‌ దర్శకత్వంలో సికిందర్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మధ్య కాలంలో సౌత్‌ దర్శకులు హిందీలో చేసిన సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా యానిమల్‌, జవాన్‌ మరి కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు నమోదు చేసిన నేపథ్యంలో సికిందర్ తో సల్మాన్‌ ఖాన్‌ కి చాలా కాలం తర్వాత ఒక సాలిడ్‌ హిట్‌ పడబోతుందని సినీ విశ్లేషకులు సైతం నమ్మకంతో ఉన్నారు.

సికిందర్ సినిమాలో సల్మాన్‌ మునుపటి లుక్‌ లో కనిపించబోతున్నాడు. అందుకు తగ్గట్లుగా ఫిజిక్ ను రెడీ చేస్తున్నాడు. తాజాగా సికిందర్ కోసం సల్మాన్‌ ఇలా కష్టపడుతున్నాడు అంటూ కండలు పెంచిన సల్మాన్‌ ఖాన్‌ ను చూపించడం జరిగింది. ఈ ఫోటో సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఫోటోను చూసిన ఫ్యాన్స్ ఇది కదా కావాల్సింది మాకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సల్మాన్‌ ఖాన్‌ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటంకు కారణం ఆయన లుక్ అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈసారి ఫిజిక్ బాగా పెంచడం వల్ల సినిమా హిట్ కొట్టడం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సల్మాన్‌ ఖాన్‌ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటిస్తున్న సికిందర్‌ సినిమాకు మురుగదాస్ దర్శకత్వం వహిస్తూ ఉంటే సాజిద్‌ నడియాడ్ వాలా భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. 2025 లో ఈద్‌ సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. రష్మిక ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా మారింది. యానిమల్‌ సినిమా ఆమెకు భారీ విజయాన్ని తెచ్చి పెట్టింది. ఇక పుష్ప 2 సినిమా తో మరోసారి ఈ అమ్మడు బాలీవుడ్‌ లో కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తోంది. రెండు సినిమాలు హిట్ అయితే సికిందర్ కి మరింత క్రేజ్ పెరగడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.