Begin typing your search above and press return to search.

స‌మంత మ‌యోసైటిస్.. దాచాల‌న్నా దాగ‌ని నిజం..

ఏదైనా ర‌హ‌స్యాన్ని లేదా వార్త‌ను గుప్పిట దాచ‌డం చాలా క‌ష్టం. అది ఓపెన్ చేయ‌డం చాలా సులువు

By:  Tupaki Desk   |   28 Aug 2023 4:15 AM GMT
స‌మంత మ‌యోసైటిస్.. దాచాల‌న్నా దాగ‌ని నిజం..
X

మ‌యోసైటిస్ గురించి సామ్ ఎందుకు ఓపెనైంది?

స‌మంత మ‌యోసైటిస్ గురించి ఎవ‌రికీ తెలియ‌ని ర‌హ‌స్యం

ఏదైనా ర‌హ‌స్యాన్ని లేదా వార్త‌ను గుప్పిట దాచ‌డం చాలా క‌ష్టం. అది ఓపెన్ చేయ‌డం చాలా సులువు. ర‌హ‌స్యంగా దాచాలి అనుకున్నా చాలా విష‌యాలు వాటంత‌ట అవే బ‌య‌ట‌ప‌డిపోతుంటాయి. ఎవ‌రైనా ఏదైనా ర‌హ‌స్యాన్ని కొన్నాళ్లు మాత్ర‌మే దాచి పెట్ట‌గ‌ల‌రు. ఇదే చేసింది స‌మంత‌. త‌న‌కు ఒక తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య ఉంద‌న్న‌ది సామ్ కొంత‌కాలంగా దాస్తూ వ‌స్తోంది. దానిపై గ‌తంలోను ర‌క‌ర‌కాలుగా మీడియాలో గాసిప్పులు వ‌చ్చేశాయి.

కానీ ప‌రిస్థితి తీవ్ర‌త‌ను అనుస‌రించి స‌మంత త‌న ప్రాబ్లెమ్ గురించి ఓపెనైంది. తొలిగా ఖుషి టీమ్ తో త‌న స‌మ‌స్య గురించి వివ‌రంగా చెప్పింది. నాగచైత‌న్య‌తో త‌న ప్రేమాయ‌ణం గురించి ఏనాడూ ఓపెన్ కాని స‌మంత పెళ్లికి ముందు మాత్ర‌మే అస‌లు సంగ‌తి చెప్పింది. డేటింగ్ అంతా గుట్టుగానే సాగింది. ఇక‌పోతే మ‌యోసైటిస్ విష‌యంలో అలా దాచ‌డానికేమీ లేదు. ప్ర‌తిదీ ఓపెనైంది.

అస‌లు ఇలా చేయ‌డానికి కార‌ణ‌మేమిటో ఖుషి స‌హ‌న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ వెల్ల‌డించాడు. ''నిజానికి ఇది బ‌య‌టికి చెప్పాల్సిన విష‌యం కాదు. కానీ ఆమె వ్యాధితో పోరాడుతోంది. దాని గురించి ఎవరికీ ఏమీ చెప్ప‌దు. కానీ తాను సూర్యరశ్మిని చూడగానే విప‌రీత‌మైన‌ నొప్పిని భ‌రిస్తుంది. ముఖంపై ప్రతిచోటా మంట త‌ట్టుకోలేదు. ప్ర‌తిదీ తెలిసిపోయేదే. అందుకే మాకు త‌న స‌మ‌స్య‌ గురించి మాకు చెప్పుకుంది.. ఏదీ దాచ‌లేదు'' అని విజ‌య్ తెలిపాడు. నిజానికి స‌మంత కోసం ఆరు నెల‌లు పైగా వేచి చూసిన ఖుషి టీమ్ సామ్ కి కొంత న‌యం అయ్యాక ఖుషి చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసింది. సామ్ కోలుకోవ‌డం కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ అండ్ టీమ్ ఎంతో ఓపిగ్గా వేచి చూసారు.

నిజానికి మ‌యోసైటిస్ అనేది దాచాల‌నుకున్నా కానీ దాగ‌నిది. ప్ర‌తిదీ బ‌హిరంగంగా అంద‌రికీ తెలిసిపోయే నిజం. బ‌య‌ట‌కు చెప్ప‌క‌పోతే దానిపై ర‌క‌ర‌కాలుగా చిత్రయూనిట్ లీకులిస్తుంది. మీడియాలో అది త‌ప్పుగా కూడా ప్ర‌చారం అయిపోవ‌చ్చు. పూర్తి విష‌యప‌రిజ్ఞానం లేకుండా క‌థ‌నాలు అల్లే మీడియాల్లో స‌మ‌స్య మ‌రింత పెద్ద‌ద‌వుతుంది. అందుకే ఇప్పుడు స‌మంత ప్ర‌తిదీ ఓపెన‌వ్వ‌డం వ‌ల్ల ఎలాంటి త‌ప్పుడు క‌థ‌నాలు రాలేదు.

కేవ‌లం త‌న‌కు ఉన్న మ‌యోసైటిస్ అనే ఆటోఇమ్యూన్ గురించి మాత్ర‌మే మీడియా మాట్లాడుతోంది. లేక‌పోతే స‌మంత‌కు ఇంకేదో పెను స‌మ‌స్య ఉంద‌ని ప్ర‌చారం సాగిపోతుంది. కానీ ఇప్పుడు అంతా స్ప‌ష్ఠంగా ఉంది. సామ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని మీడియా కూడా కోరుకుంటోంది. ఇప్పుడు త‌న వ్యాధిని పూర్తిగా న‌యం చేసుకునేందుకు స‌మంత త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అమెరికాలో త‌న కుటుంబంతో మూడు నెల‌లు ఉంటుంద‌ట‌. ఏడాది పైగా చికిత్స చేయాల్సి ఉంటుందని కూడా టాక్ వినిపిస్తోంది.