Begin typing your search above and press return to search.

ఇలా జరగకుండా ఉంటే బాగుండేదని అనుకున్నాను: సమంత

'ఖుషి' తర్వాత సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నుంచి మరో సినిమా రాలేదు. అనారోగ్యం నుంచి కోలుకున్న సామ్

By:  Tupaki Desk   |   26 July 2024 2:57 PM GMT
ఇలా జరగకుండా ఉంటే బాగుండేదని అనుకున్నాను: సమంత
X

'ఖుషి' తర్వాత సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నుంచి మరో సినిమా రాలేదు. అనారోగ్యం నుంచి కోలుకున్న సామ్.. రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ చేసింది. మరోవైపు ఎప్పటిలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేస్తూ వస్తోంది. అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో హెల్త్ టిప్స్ పంచుకుంటోంది. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జీవితంలో ఎదురయ్యే ప్రతీ కష్టాన్ని ఎదుర్కోవాల్సిందేనని, తాను ఈ స్థాయికి రావడానికి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాని తెలిపింది.

మన లైఫ్ లో జరిగే కొన్ని విషయాలు మార్చుకోవాలని కోరుకుంటాం. ఒక్కోసారి వీటన్నిటినీ మనం భరించాల్సిందేనా అని ఆశ్చర్యపోతుంటాం. అలా జరగకుండా ఉంటే బాగుండని అనుకుంటాం. వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు వేరే మార్గం కనిపించదు అని సమంత వ్యాఖ్యానించింది. గత మూడేళ్లలో ఇలా జరగకుండా ఉంటే బాగుండేదని ఎన్నో విషయాల్లో అనుకున్నానని, కానీ జీవితంలో వచ్చే ప్రతీ కష్టాన్ని ఎదుర్కోవాల్సిందేనని చెప్పింది. కష్టాలు ఎదుర్కొన్నప్పుడే జీవితాన్ని గెలిచినట్లుగా తాను భావిస్తానంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎంతో ధైర్యంగా ఉన్నానని, తాను ఈ స్థాయికి రావడానికి అగ్నిగుండాల్లాంటి ఎన్నో సమస్యలను కూడా అధిగమించానని తెలిపింది. సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత.. నాలుగేళ్లు తిరక్కుండానే వివాహ బంధానికి స్వస్తి పలికింది. విడిపోడానికి అసలు కారణం ఏంటనేది ఎవరికీ తెలియదు కానీ, అప్పటి నుంచి వీరిద్దరూ వేర్వేరు దారుల్లో ప్రయాణం సాగిస్తున్నారు. దీనిపై సామ్ ఇప్పటికే స్పందించింది. సినిమాల మీద ఫోకస్ పెట్టి మూవ్ ఆన్ అవ్వాలని భావించింది. అదే సమయంలో ఆమె మైయోసిటిస్ అనే ఇమ్యునో వ్యాధి బారిన పడింది. దీంతో సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకొని చికిత్స తీసుకుంది.

కొంతకాలం విరామం తర్వాత సమంత మళ్లీ సినిమాలతో బిజీగా మారాలని ప్లాన్ చేసుకుంది. ఇటీవలే తన హోమ్ బ్యానర్ లో 'మా ఇంటి బంగారం' అనే చిత్రాన్ని అనౌన్స్ చేసింది. మమ్ముట్టి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబోలో తెరకెక్కుతున్న ఓ మలయాళ మూవీలో నటించనుందని టాక్ వినిపిస్తోంది. అలానే నెట్ ఫ్లిక్స్ కోసం ఓ వెబ్‌ సిరీస్‌ చేయడానికి కమిట్ అయిందని సమాచారం. 'తుంబాడ్' ఫేమ్ అనిల్‌ బర్వే దర్శకత్వంలో రానున్న ఈ సిరీస్ లో ‘మీర్జాపూర్‌’ నటుడు అలీ ఫజల్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

ఇక 'ఫ్యామిలీ మ్యాన్' దర్శక ద్వయం రాజ్‌ & డీకే డైరెక్షన్ లో 'సిటాడెల్‌: హనీ- బన్నీ' అనే వెబ్ సిరీస్ లో నటించింది సమంత. ఇందులో బాలీవుడ్ స్టార్ వరుణ్‌ ధావన్‌ కు జోడీగా కనిపించనుంది. ఇది రూసో బ్రదర్స్ యొక్క 'సిటాడెల్‌' కు ఇండియన్ వెర్షన్. ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ లో సామ్ ఒక ఏజెంట్ పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ త్వరలోనే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కాబోతోంది. ఆగస్టు 1వ తేదీన ఈ సిరీస్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని ప్రకటించబోతున్నట్లు సామ్ ఇన్‌స్టాలో తెలిపింది.