Begin typing your search above and press return to search.

సప్తసాగరాలు తెలుగు ట్రైలర్.. ఎలా ఉందంటే..

కన్నడ హీరో రక్షిత్ శెట్టి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన తెలుగు ప్రేక్షకుల ముందుగా హీరోయిన్ రష్మిక బాయ్ ఫ్రెండ్ గా పరిచయం

By:  Tupaki Desk   |   19 Sep 2023 11:16 AM GMT
సప్తసాగరాలు తెలుగు ట్రైలర్.. ఎలా ఉందంటే..
X

కన్నడ హీరో రక్షిత్ శెట్టి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన తెలుగు ప్రేక్షకుల ముందుగా హీరోయిన్ రష్మిక బాయ్ ఫ్రెండ్ గా పరిచయం. వారిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తర్వాత, తనను తాను హీరోగా నిరోపించుకోవడానికి ఆయన రెడీ అయ్యారు. '777 చార్లీ' సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో ఓవైర్ నైట్ పాపులారిటీ సంపాదించుకున్నాడు.

దానికి ముందు అతడే శ్రీమన్నారాయణ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. చార్లీతో ఇక్కడ కూడా అభిమానం సంపాదించుకున్నాడు. రీసెంట్ గా బాయ్స్ హాస్టల్ అనే సినిమాని కూడా తీసుకువచ్చాడు. దీనిలో గెస్ట్ రోల్ లోనూ మెరిశాడు. అయితే, ఆయన మరోసారి ఓ పవర్ ఫుల్ లవ్ స్టోరీతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేయాలని ఫిక్స్ అయ్యాడు.

ఆయన నటించిన తాజా చిత్రం సప్త సాగర దాచె ఎల్లో సైడ్‌-ఏ. ఈ సినిమా కన్నడలో విడుదల కాగా, ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీనినే సప్త సాగరాలు దాటి అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. తెలుగులో ఈ మూవీ ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ని తెలుగులో నేచురల్ స్టార్ నాని విడుదల చేయడం విశేషం.

ఆయన సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ విడుదల చేసి, రక్షిత్ శెట్టిపై ప్రశంసలు కురిపించాడు. ఈ అద్భతమైన ప్రేమ కథ గురించి చాలా విన్నానని, చూడాలని ఆశపడుతున్నానని నాని చెప్పారు. అంతేకాకుండా, తన ఫ్రెండ్ రక్షిత్ శెట్టి, ఆ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.ట్రైలర్ చూస్తుంటే ప్యూర్ లవ్ స్టోరీ అని అర్థమౌతోంది. ప్రియా అనే గాయని, మను అనే కారు డ్రైవర్‌ ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. సడెన్ గా హీరో, హీరోయిన్లు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏకంగా శిక్ష పడి జైలుకు వెళతాడు. మరి , వారిద్దరూ కలిశారా? ఈ ప్రేమకథ చివరికి ఏ తీరం చేరింది? అనేది చూడాలంటే విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

ఈ సినిమా తెలుగులో సెప్టెంబర్ 22వ తేదీన విడుదల కానుంది. ఇది మొదటి భాగం మాత్రమే. రెండో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నారట. మొదట భాగం తెలుగులో క్లిక్ అయితే, రెండో భాగాన్ని కన్నడ, తెలుగు రెండు భాషల్లో ఒకేసారి విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాకి హేమంత్ దర్శకత్వం వహించారు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది.