Begin typing your search above and press return to search.

ఇంట్రెస్టింగ్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందహో..!

కోలీవుడ్ హీరో కార్తి సినిమా సినిమాను ప్రత్యేకమైన కథలతో చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   22 Oct 2024 10:28 AM GMT
ఇంట్రెస్టింగ్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందహో..!
X

కోలీవుడ్ హీరో కార్తి సినిమా సినిమాను ప్రత్యేకమైన కథలతో చేస్తున్నారు. జపాన్ తర్వాత ఆయన చేసిన సినిమా మేయలగన్ తెలుగులో సత్యం సుందరం గా రిలీజైంది. ఆరేడేళ్ల క్రితం 96 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రేమ్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజైంది. థియేట్రికల్ రిలీజ్ లో సినిమా సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అయ్యింది. సత్యం సుందరం సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను ఈ నెల 27న ఓటీటీ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

కార్తి తో పాటుగా అరవింద్ స్వామి కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్ర చేశారు. 30 ఏళ్ల క్రితం ఊరు వదిలి వెళ్లిన సత్యం, బాబాయ్ కూతురు అంటే చెల్లి పెళ్లికి వస్తాడు. ఆ టైంలో సుందరం అతనికి కంపెనీ ఇస్తాడు. సుందరం అవతల వారు ఏమనుకుంటున్నారు అన్నది కాదు తాను చెప్పాలనుకున్నది చెబుతాడు. అలా బావా బావా అంటూ సత్యం వెంటే ఉంటాడు. అతని వల్లే సత్యం ఎక్కాల్సిన బస్ మిస్ అవుతుంది.

చిన్నగా సుందరం అమాయకత్వం అర్ధం చేసుకున్న సత్యం అతనితో క్లోజ్ అవుతాడు. ఎలాగు బస్ మిస్ అయ్యిందని బావని తన ఇంటికి తీసుకెళ్తాడు సుందరం. ఇలా ఆ నైట్ అంతా చిన్ననాటి జ్ఞాపకాలతో గడిపేస్తారు. ఐతే ఇంత చేసినా సరే సుందరం ఎవరన్నది సత్యం కి గుర్తుకు రాదు. కనీసం అతని పేరు కూడా తెలియదు. అలా ఎమోషనల్ రైడ్ గా జరిగే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేట్రికల్ హిట్ అయిన ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తుందని చెప్పొచ్చు.

ఈ సినిమాను సూర్య తన 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మించారు. కార్తి సరసన శ్రీదివ్య నటించింది. కార్తి, అరవింద్ స్వామిల కామెడీ, ఎమోషనల్ సీన్స్ అన్నీ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తాయి. థియేటర్ లో మిస్సైన ప్రతి ఒక్కరు ఓటీటీ రిలీజ్ తర్వాత ఈ సినిమా చూసి సూపర్ అనేస్తారని చెప్పొచ్చు. ప్రేమ్ కుమార్ తన మార్క్ చూపించేలా సత్యం సుందరం తెరకెక్కించారు.