Begin typing your search above and press return to search.

'అఖిల్‌' హీరోయిన్‌ అమ్మ తర్వాత మళ్లీ...!

అక్కినేని అఖిల్‌ మొదటి సినిమా 'అఖిల్‌' తో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ సాయేషా సైగల్‌.

By:  Tupaki Desk   |   24 Jun 2024 2:30 PM GMT
అఖిల్‌ హీరోయిన్‌ అమ్మ తర్వాత మళ్లీ...!
X

అక్కినేని అఖిల్‌ మొదటి సినిమా 'అఖిల్‌' తో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ సాయేషా సైగల్‌. బాలీవుడ్‌ లెజెండ్‌ దిలీప్ కుమార్‌ ఫ్యామిలీకి చెందిన ఈ అమ్మడు హీరోయిన్‌ గా అక్కడ ఇక్కడ మంచి ఆధరణ దక్కించుకోవడం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.


అఖిల్‌ సినిమా డిజాస్టర్ అవ్వడంతో తెలుగు లో ఈ అమ్మడికి ఆఫర్లు రాలేదు. ఇతర భాషల్లో అయినా ప్రయత్నాలు చేసి హిట్ అవ్వాలి అనుకుని తమిళంలో సినిమాలు చేసింది. తెలుగు తో పోల్చితే తమిళంలో ఒక మోస్తరు హిట్స్ దక్కాయి. దాంతో అక్కడ వరుసగా సినిమాలు చేసింది.

హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలోనే హీరో ఆర్య తో ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం, బిడ్డకు జన్మనిచ్చి అమ్మ అవ్వడం కూడా బ్యాక్ టు బ్యాక్‌ జరిగి పోయాయి. అమ్మ అయిన సాయేషా సైగల్‌ సినిమాలకు బ్రేక్ తీసుకుంది. ఇక పై సాయేషా సినిమాలు చేయదేమో అనుకుంటున్న సమయంలో ఆసక్తికర వార్త ఒకటి తమిళ మీడియా సర్కిల్స్ లో వినిపిస్తోంది.

ఇన్ని రోజులు అమ్మగా బిజీగా ఉన్న సాయేషా మళ్లీ కెమెరా ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మధ్య కాలంలో రెండు మూడు కథలను కూడా సాయేషా విన్నట్లుగా తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాదిలో వెండి తెరపై సాయేషా ని మళ్లీ చూడబోతున్నారు.

ఒకప్పుడు పెళ్లి పిల్లల తర్వాత హీరోయిన్స్ ని పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు వ్యక్తిగత విషయాలతో సంబంధం లేకుండా హీరోయిన్స్ కి ఆఫర్లు వస్తున్నాయి. పెళ్లిలు అయినా, పిల్లలు ఉన్నా కూడా హీరోయిన్స్‌ ఆఫర్లు సొంతం చేసుకుంటున్న విషయం తెల్సిందే.

బాలీవుడ్‌ లో చాలా మంది హీరోయిన్స్‌ అమ్మలుగా అయిన తర్వాత మరింత బిజీ అయ్యారు. కనుక సాయేషా సైగల్‌ కూడా అమ్మగా మారిన తర్వాత సినిమాలు చేయాలని ప్రయత్నాలు చేస్తుంది. మరి ఈమె ప్రయత్నాలు ఎంతవరకు సఫలం అవుతాయి అనేది చూడాలి.