Begin typing your search above and press return to search.

SDT18: బిగ్ ప్రాజెక్టుతో సాయి ధరమ్ తేజ్.. అంతకుమించి!

ఈ పోస్టర్ ద్వారా సినిమా ఒక యూనివర్సల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుందని అనిపిస్తోంది. ఇప్పటికే విరుపాక్ష సినిమాతో సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ వద్ద బిగ్ సక్సెస్ అందుకున్నాడు.

By:  Tupaki Desk   |   21 Jun 2024 12:20 PM GMT
SDT18: బిగ్ ప్రాజెక్టుతో సాయి ధరమ్ తేజ్.. అంతకుమించి!
X

తాజాగా సాయి ధరమ్ తేజ్ తన కొత్త సినిమా ప్రారంభించారు. గతంలో "విరూపాక్ష" మరియు "బ్రో" సినిమాల విజయాల తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ మెగా హీరో అనేక రకాల కథలపై చర్చలు జరిపారు. ఎంతో డిఫరెంట్ గా ఉంటే గాని ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకుని రాకూడదు అనుకున్నాడు. ఇక ఇప్పుడు అతని నుంచి మరో విభిన్నమైన సినిమా రాబోతోంది. ఇప్పుడు ఆయన ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ ప్రాజెక్ట్‌కి రోహిత్ కెపీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ గత చిత్రాల విజయాల తర్వాత ఈ సినిమా పట్ల మరింత ఆశాభావంతో ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను ఇటీవల విడుదల చేశారు. ఎడారి భూమిలో పచ్చని చెట్టు ఉండడం, ల్యాండ్ మైన్‌లు చుట్టుముట్టిన దృశ్యం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఈ పోస్టర్ ద్వారా సినిమా ఒక యూనివర్సల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుందని అనిపిస్తోంది. ఇప్పటికే విరుపాక్ష సినిమాతో సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ వద్ద బిగ్ సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని మంచి బూస్ట్ ఇచ్చింది. ఇక ఆ తరువాత ఎన్నో రకాల ఆఫర్స్ అందుకున్న ఈ మెగా హీరో తొందరపడకుండా పర్ఫెక్ట్ కథ దొరికే వరకు ఎదురు చూశాడు.

ఇక ఇప్పుడు SDT18 వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న కొత్త సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాజెక్టు పై నిర్మాతలు మాట్లాడుతూ, "ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో, గ్రాండ్ స్కేల్‌తో రూపొందుతుంది. సాయి ధరమ్ తేజ్ పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం నిర్మించిన ఒక భారీ సెట్‌లో మొదటి షెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం," అని అన్నారు.

ఈ ప్రాజెక్ట్ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుంది. "విరూపాక్ష" మరియు "బ్రో" వంటి విజయాల తర్వాత, సాయి ధరమ్ తేజ్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పై అందరి ఆసక్తి పెరుగుతుంది, మరియు సాయి ధరమ్ తేజ్ తన నటనతో మరోసారి అభిమానులను మంత్ర ముగ్ధుల్ని చేయడం ఖాయంగా కనిపిస్తోంది.