Begin typing your search above and press return to search.

రన్‌ రాజా రన్ అందం చూశారా...!

హీరోయిన్ గా ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఓటీటీ సినిమాలు మరియు వెబ్‌ సిరీస్‌ ల్లో కూడా నటిస్తూ ఉంది.

By:  Tupaki Desk   |   13 Aug 2024 5:36 AM GMT
రన్‌ రాజా రన్ అందం చూశారా...!
X

2014లో రన్‌ రాజా రన్ సినిమాలో శర్వానంద్‌ కు జోడీగా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ సీరత్‌ కపూర్. ఈ అమ్మడు ఆ తర్వాత తెలుగు లో పలు సినిమాల్లో నటించింది. మొదటి సినిమాతోనే హిట్‌ ను సొంతం చేసుకోవడం వల్ల దశాబ్ద కాలం అయినా కూడా ఈ అమ్మడి సొంతం కంటిన్యూ అవుతోంది. చేసిన సినిమాలు కొన్ని అయినా కూడా ప్రతి సినిమా తో అలరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్న ఈ అమ్మడు తెలుగు తో పాటు హిందీ సినిమాల్లో కూడా అప్పుడప్పుడు నటిస్తూ బిజీ బిజీ గా కెరీర్ లో కొనసాగుతున్న విషయం అందరికి తెలిసిందే.


హీరోయిన్ గా ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఓటీటీ సినిమాలు మరియు వెబ్‌ సిరీస్‌ ల్లో కూడా నటిస్తూ ఉంది. నటిగా ఎప్పుడూ బిజీగా ఉండాలని ఆశించే ఈ అమ్మడు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. నటిగా ప్రస్తుతం ఈ అమ్మడు ఒక హిందీ సినిమాను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా కి సంబంధించిన ప్రకటన త్వరలో వెల్లడి అయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. సోషల్‌ మీడయాలో సీరత్ కపూర్ చాలా యాక్టివ్‌ గా ఉండి తన అందమైన ఫోటోలను మరియు వీడియోలను షేర్ చేయడం మనం చూస్తూ ఉంటాం.


తాజాగా మరోసారి అందమైన ఫోటోలు షేర్ చేసింది. మీరు ధరించగలిగే అత్యంత స్టైలిష్ విషయం విశ్వాసం.. అంటూ ఈ ఫోటోలతో పాటు మంచి సందేశాన్ని నెటిజన్స్ కి అందించింది. ఎంతటి ఖరీదైన ఔట్ ఫిట్‌ ధరించినా, స్టైలిష్ ఔట్‌ ఫిట్‌ లో కనిపించినా కూడా మనలో విశ్వాసం అనేది లేకుంటే ఆ ఫోటోలకు అందం ఉండదు అంటూ సీరత్‌ కపూర్‌ చేసిన కామెంట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సీరత్‌ కపూర్‌ ఫేస్ లో చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తుందని, ఆమె అదే కాన్ఫిడెన్స్ తో ముందు ముందు కొనసాగాలి అంటూ అభిమానులు మరియు నెటిజన్స్ కోరుకుంటున్నారు.

ఇక సీరత్ కపూర్‌ కెరీర్‌ విషయానికి వస్తే... 2011 రాక్‌స్టార్‌ సినిమాకు సీరత్‌ కపూర్ అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్ గా పని చేసింది. సుజీత్‌ దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా రూపొందిన రన్‌ రాజా రన్‌ సినిమా లో నటించడం ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. వారణాసి నేపథ్యంలో సందీప్ కిషన్ హీరోగా రూపొందిన టైగర్‌ సినిమాలో హీరోయిన్‌ గా నటించింది. నాగార్జున కీలక పాత్రలో నటించిన రాజుగారి గది 2 చిత్రంలో కూడా సీరత్‌ కపూర్ నటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. అల్లు శిరీష్ తో ఒక్క క్షణం సినిమా చేస్తోంది. సినిమాలతో పాటు పలు కమర్షియల్‌ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా పలు యాడ్స్‌ లో నటించింది.