Begin typing your search above and press return to search.

ప్రపంచకప్ ఫైనల్‌ లో భారత్‌... షిన్వారీ వక్రబుద్ది పీక్స్!

ఈ సమయంలో టీం ఇండియాపై అక్కసు వెళ్లగక్కే విషయంలో ముందుండే పాకిస్తాన్‌ నటి సెహర్‌ షిన్వారీ.. మరోసారి తన వంకర బుద్ధిని బయటపెట్టింది!

By:  Tupaki Desk   |   16 Nov 2023 11:05 AM GMT
ప్రపంచకప్  ఫైనల్‌  లో భారత్‌... షిన్వారీ వక్రబుద్ది పీక్స్!
X

వన్ డే క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ లో టీం ఇండియా జైత్రయాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. లీగ్ మ్యాచ్ లో వందశాతం సక్సెస్ తో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో నిలిచిన టీం ఇండియా... సెమీస్ లోనూ న్యూజిలాండ్‌ పై ఘనవిజయం సాధించి ఫైనల్‌ కు చేరింది. ఫలితంగా వరల్డ్ కప్ లో నాలుగోసారి ఫైనల్ కు చేరినట్లయ్యింది. ఈ సమయంలో పాక్ నటి గోల గోల పెట్టడం మొదలుపెట్టింది!

అవును... 1983, 2003, 2011, 2023ల్లో వరుసగా నాలుగుసార్లు వరల్డ్ కప్ ఫైనల్‌ కు చేరిన టీం ఇండియాలో అందులో 1983, 2011లో రెండు సార్లు కప్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అహ్మదాబాద్‌ లో ఆదివారం జరగనున్న ఫైనల్‌ పోరుకు సై అంటూ రెడీగా ఉంది. ఇలా ఈ వరల్డ్ కప్ లో భారత్ చూపించిన ఫెర్ఫార్మెన్స్ కు ప్రపంచవ్యాప్తంగా అభినందనలు అందుతున్నాయి.

ఈ టోర్నీలో టీం ఇండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాళ్లోనూ తనదైన ఫెర్ఫార్మెన్స్ చూపించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సమయంలో భారత్ జైత్రయాత్రను పాకిస్తాన్‌ అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ పక్క పాక్ పూర్ ఫెర్ఫార్మెన్స్ తో ఇంటికి చేరడం ఒక బాధ అయితే... టీం ఇండియా బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ తో ఫైనల్ కు చేరుకోవడం వారికి మరొక బాదగా ఉంది.

ఈ సమయంలో టీం ఇండియాపై అక్కసు వెళ్లగక్కే విషయంలో ముందుండే పాకిస్తాన్‌ నటి సెహర్‌ షిన్వారీ.. మరోసారి తన వంకర బుద్ధిని బయటపెట్టింది! గతంలో భారత్‌ ను ఓడిస్తే బంగ్లాదేశ్ కుర్రాడితో డేట్ చేస్తానంటూ ప్రకటన చేసిన షిన్వారీ.. తాజాగా టీం ఇండియాపై అక్కసు వెళ్లగక్కింది. ఈ సందర్భంగా ట్విట్టర్ లో వివాదాస్పద పోస్ట్లు పెట్టింది!!

"భారత్ అన్నింటిలోనూ పాకిస్తాన్ కంటే ముందంజలో ఎలా ఉందో తనకు అర్థం కావడం లేదంటూ" తాజాగా పాక్ నటి షిన్వారీ వ్యాఖ్యానించింది. "త్వరలోనే బీసీసీఐ, బీజేపీలు సర్వనాశనం కానున్నాయి" అంటూ మరోసారి తనలోని ద్వేషాన్ని ఆన్ లైన్ వేదికగా వెల్లగక్కింది. అంతకు ముందు సెమీస్ లో కివీస్ పై విక్టరీ సాధించడంపైనా తన అక్కసు వెళ్లగక్కింది.

ఇందులో భాగంఘా... "మ్యాచ్‌ ఫిక్స్‌ అయిందని భారత ఆటగాళ్లకు ముందే తెలుసు.. కానీ మ్యాచ్‌ లో బాగా ఆడుతున్నట్లు భారత ఆటగాళ్లు బాగా నటించారు. వాళ్లందరూ కూడా మంచి నటులు" అని విమర్శిస్తూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్లు సోషల్‌ మీడియాలో వైరల్ కావడంతో భారత జట్టు అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు. ఆ ట్వీట్లకు దిమ్మతిరిగి బొమ్మ కనిపించేలా రీట్వీట్లు పెడుతూ, కామెంట్లు పెడుతున్నారు!